Mohan lal : రోషన్ పాన్ ఇండియా చిత్రం ప్రారంభం

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ పాన్ ఇండియా సినిమా ప్రారంభ కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. పెళ్లి సందడి సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచమైన రోషన్ రెండవ సినిమా కూడా ఇంకా రిలీజ్ అవకుండానే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని కొట్టేసాడు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ చిత్రానికి నందకిశోర్ దర్శకత్వం వహించబోతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకు వృషభ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక ఈ సినిమాలో రోషన్, మోహన్ లాల్ కొడుకుగా నటించబోతున్నట్టు సమాచారం. రోషన్ కు జోడిగా ఈ సినిమాలో సన్యా ఠాకూర్ నటిస్తుంది. ఇటీవలనే సన్యా ఠాకూర్ నిఖిల్ స్పై సినిమాలో నటించి, తన గ్లామర్ తో పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. అలాగే హీరో శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడట.

ప్రస్తుతం రోషన్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే రోషన్ ఈ బంపర్ అఫర్ కొట్టేసాడు. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోల వారసులంతా హీరోలుగా ఎంట్రీ ఇస్తుండగా, వాళ్ళతో పోలిస్తే రోషన్ చాలా అందగాడు. కరెక్ట్ సినిమా పడితే స్టార్ హీరోల లిస్ట్ చేరతాడని ఇండస్ట్రీలో అంత బహిరంగానే మాట్లాడుకుంటారు.దానికి తోడు కెరీర్ బిగినింగ్ లోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆఫర్ కొట్టేసాడు. మరీ ఈ సినిమా రోషన్ కెరీరి ఎంత మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు