Vishnu : హిట్ అవుతాడా.. ట్రోల్స్ కు గురవుతాడా ?

డైలాగ్ కింగ్ మోహన్ బాబు నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు. మొదట్లో కాస్త మంచి సినిమాలు చేస్తూ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఢీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆయన కెరీర్ లో ఉంది. అయితే దీని తర్వాత అంతటి హిట్ కొట్టిన అనుభవం మంచు విష్ణుకు లేదు. చాలా అంచనాలతో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన ప్రతి సారి విష్ణుకు నిరాశే దక్కుతుంది. గతేడాది మంచు విష్ణు మోసగాళ్లు అనే సినిమా చేశాడు. ఈ సినిమాను స్వయంగా విష్ణు రూ. 51 కోట్లతో నిర్మించాడు.

ఇందులో విష్ణుకు అక్కగా టాలీవుడ్ హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ నటించింది. సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర లాంటి పేరున్న నటులు కూడా ఉన్నారు. దీన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల చేశారు. ఇది దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. ప్రొడక్షన్ ఖర్చుల్లో కనీసం 1 శాతం కూడా వసూళ్లు కాలేదు. ఈ దెబ్బతో విష్ణు సినిమాలకు పూర్తిగా దూరం అవుతాడని అనుకున్నారు. ఆయన కూడా మా అధ్యక్షుడిగా పోటీ చేసి విజయం సాధించారు.

అయితే ఇప్పుడు జిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. దీవాళి కానుకగా రేపు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఈ జిన్నా మూవీ రిలీజ్ అవుతుంది. అందుకోసం ప్రమోషన్లను కూడా మంచు విష్ణు భారీ స్థాయిలోను చేశాడు. అందాలను దారబోసే పాయల్ రాజ్ పుత్, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న సన్నిలీయోన్ ఈ సినిమాలో నటించడం కొంత వరకు ప్లస్ గా ఉంది. అలాగే టాలీవుడ్ కు ఎన్నో హిట్స్ అందించిన కొన వెంకట్ దీనికి స్టోరీ ఇవ్వడం అంచనాలను పెంచుతుంది.

- Advertisement -

ఇన్ని అంచనాల మధ్య జిన్నా మూవీ రేపు విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే మంచు విష్ణు కెరీర్ పరంగా మంచి బ్రేక్ వస్తుంది. ఒక వేళ పాత ఫలితాలే వస్తే.. మంచు విష్ణు కు మళ్లీ ట్రోల్స్ రావడం ఖాయం. మరీ ట్రోల్స్ ను తెచ్చుకుంటాడో.. లేదా హిట్ కొట్టి ట్రోల్స్ చేసేవారికి గట్టి సమాధానం ఇస్తాడో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు