Box office: మూడు రోజుల్లో విరూపాక్షుడి భీభత్సం

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ విరుపాక్ష. ఏప్రిల్ 21 న భారీ ఎక్స్ పెక్టషన్స్ తో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ డే మార్నింగ్ షో లో చాలా చోట్ల సగం మాత్రమే హౌస్ ఫుల్స్ అయిన ఈ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్ తో ఈవినింగ్, నైట్ షో లు ఫుల్ అయ్యాయి. ఫస్ట్ డే సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో 2ను హైయెస్ట్ ఓపెనింగ్ ని తెచ్చుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 6.35 కోట్ల షేర్ వసూలు చేసింది. అదే జోరు రెండో రోజు చూపిస్తూ ఫస్ట్ డే ని మించి 7.30 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

మూడో రోజు విరూపాక్ష తెలుగు రాష్ట్రాల్లో 5.77 కోట్ల షేర్ వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 7.17 కోట్ల షేర్ ని వసూలు చేసింది. మొత్తంగా విరూపాక్ష మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 20.82 కోట్ల షేర్ ని వసూలు చేసింది.

విరూపాక్ష టోటల్ గా 22.20 కోట్ల బిజినెస్ చేయగా 23 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే విరూపాక్ష ఆ టార్గెట్ ని దాదాపుగా కేవలం మూడు రోజుల్లోనే రీచ్ అయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 2 కోట్లు కావాలి. నాలుగో రోజు ఈ టార్గెట్ ని ఖచ్చితంగా అందుకోవచ్చు.

- Advertisement -

మార్చి 30 న విడుదలైన దసరా సినిమా తర్వాత ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు. కాబట్టి థియేటర్లు ఖాళి అయ్యాయి. అది విరూపాక్ష కి అడ్వాంటేజ్ అయ్యింది. ఇక విరూపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు