Allu Arjun: పాపం రకుల్.. టాలీవుడ్‌కి మళ్లీ రావాలని గట్టిగానే ట్రై చేస్తుంది

రకుల్ ప్రీత్ సింగ్.. ఈమె పరిస్థితి ప్రస్తుతం అంత బాగలేదు. కానీ, కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్స్ లిస్ట్ లో మొదటి వరుసలో ఉండేది. ఎంట్రీ కన్నడ ఇండస్ట్రీలో ఇచ్చినా, త్వరలోనే తెలుగు తెరపై కనిపించింది. ఈ బ్యూటీ తెలుగులో నటించిన మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఓ సందర్భంలో టాలీవుడ్ లో ఈమె వరుసగా 13 సినిమాలు చేసింది. అది రకుల్ కు గోల్డేన్ టైం అని చెప్పొచ్చు.

ఈ బ్యూటీ కెరీర్ లో లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్స్ ఉన్నాయి. వీటితో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో గుర్తింపు వచ్చింది.. ఇక బాలీవుడ్ లో తన సత్తా చాటుతా అన్నట్టు బీ టౌన్ కి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ. అయితే, ఎన్నో అంచనాలతో బాలీవుడ్ గడప తొక్కిన రకుల్ కు అక్కడ భారీ నిరాశ దక్కింది. హిందీలో చేసిన సినిమాలు హిట్ కాలేక పోయాయి. దీంతో మరోసారి సౌత్, టాలీవుడ్ వైపు చూస్తుంది.

అయితే, తాజాగా రకుల్ చేసిన ఒక ట్వీట్ తో ఈమెకు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంత ఆసక్తితో ఉందో తెలిస్తుంది. రకుల్, అల్లు అర్జున్ జంటగా నటించిన సరైనోడు చిత్రం రిలీజ్ అయి ఆదివారానికి 7 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా, రకుల్ ప్రీత్ సింగ్ ఒక ట్వీట్ చేసింది. సరైనోడు వచ్చి ఏడేళ్లు అవుతుంది. కానీ, నాకు నిన్ననే జరిగినట్టు ఉంది. అంటూ ట్వీట్ చేసింది రకుల్. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోవడం, టాలీవుడ్ లో మరోసారి కనిపించాలనే ఆలోచన ఈ ట్వీట్ లో కనిపిస్తుంది అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. అలాగే మరి కొందరు.. టాలీవుడ్ కి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ బ్యూటీ తెలుగు దర్శక నిర్మాతల కంట పడేది ఎప్పుడో.. తెలుగు తెరపై కనిపించేంది ఎప్పుడో.. చూడాలి.

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు