Varasudu : ఫ్యామిలీ డ్రామాను మించి..

తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం వారిసు. తెలుగులో వారసుడు. దీనిలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్నారు. అలాగే రష్మికా మందన్నా హీరోయిన్ గా చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజ్, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న చిత్రంగా మూవీ యూనిట్ ప్రకటించింది. కానీ తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి వారీసు చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. వారీసు పూర్తి స్థాయి తమిళ సినిమా అని తెలిపారు. దీన్ని తెలుగు డబ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే వారసుడు చిత్రం ఫ్యామిలీ డ్రామాగా వస్తుందని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇటీవల మూవీ యూనిట్ నుంచి వచ్చిన అప్డేట్స్ తో కూడా వారీసు చిత్రం ఫ్యామిలీ డ్రామా అని ప్రేక్షకులకు అర్థమవుతుంది. కానీ, వారీసు ఫ్యామిలీ డ్రామా చిత్రం కాదని దర్శకుడు వంశీ పైడిపల్లి అంటున్నారు.

విజయ్ వంటి పాన్ ఇండియా స్టార్ తమ సినిమాలో ఉంటే ఒక జోనర్ కే ఎందుకు పరిమితం అవుతామని అన్నారు. ఫ్యామిలీ డ్రామాకు మించిన స్టోరీతో వారీసు ను తెరకెక్కిస్తున్నట్టు ఆయన వివరించారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని తెలిపారు. వారీసు చిత్రం స్టోరీ చెప్పిన వెంటనే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. అంతలా స్టోరీ ఉందని వంశీ పైడిపల్లి అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు