Trivikram Movies : థియేటర్స్ ను మించి టీవీలో

స్వయంవరం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రచయితగా అడుగు పెట్టాడు త్రివిక్రమ్. మొదటి సినిమాతోనే తన మార్క్ డైలాగ్స్ తో అద్భుతమైన పేరు సాధించాడు. స్వయంవరం సినిమా తర్వాత త్రివిక్రమ్ కి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం ఒకేసారి అవకాశాలు అన్నిటినీ అందిపుచ్చుకోకుండా, ఆచితూచి అడుగు వేసి నేడు తనకంటూ ఒక స్థానాన్ని సాధించుకున్నాడు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కు రచయితగా వర్క్ చేసిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారాడు. తరుణ్ శ్రియ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని చవిచూసింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతడు సినిమాని తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఈ సినిమా కమర్షియల్ గా అప్పుడు పెద్దగా హిట్ కాలేదు. కానీ ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ను నమోదు చేసుకుంటుంది. ఒక రిపీట్ వాల్యూ ఉన్న సినిమాను త్రివిక్రమ్ తీశాడు అంటూ ఇప్పటికీ చాలామంది కొనియాడుతారు.

తరుణ్, నితిన్ మినహాయిస్తే త్రివిక్రమ్ కెరియర్లో ఇప్పటివరకు స్టార్ హీరోలతో మాత్రమే కేవలం సినిమాలు చేశాడు. త్రివిక్రమ్ చేసిన సినిమాలకి ఎక్కువ శాతం సక్సెస్ రేట్ ఉంది. అయితే త్రివిక్రమ్ సినిమాలు థియేటర్లో కంటే కూడా టీవీలో మంచి రెస్పాన్స్ సాధిస్తాయని చెప్పొచ్చు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాన్ని సాధించలేకపోయింది. కానీ ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి ఈ సినిమా కూడా మంచి టిఆర్పి రేటింగ్ ను నమోదు చేసుకుంటుంది.

- Advertisement -

రీసెంట్ గా వీరి కాంబినేషన్లో గుంటూరు కారం అనే సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. కానీ మహేష్ బాబుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన మెల్లమెల్లగా ఈ టాక్ కాస్త పాజిటివ్ గా మారి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ 2020లో రిలీజ్ అయిన అల వైకుంఠపురంలో అనే సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకొని నాన్ బాహుబలి సినిమా రికార్డ్స్ ను కొట్టాడు.

ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ కి కూడా చాలా మంచి ప్లస్ అయ్యింది. ఇకపోతే ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా పుష్ప. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే అలవైకుంఠపురంలో సినిమా థియేటర్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించి అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిందో మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను రీసెంట్గా జెమినీ టీవీలో ప్రసారం చేశారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ ఆల్ టైం రికార్డ్ ను ఇదివరకే క్రియేట్ చేసింది.

ఇక రీసెంట్ గా మరోసారి ఈ సినిమా జెమినీ టీవీలో ప్రసారమైనప్పుడు 6.06 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి ఫలితాలను అందుకున్న కూడా టీవీలో ప్రసారమైన ప్రతిసారి కూడా ఒక కొత్త రికార్డును సృష్టిస్తాయని చెప్పొచ్చు.
అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సుశాంత్, నివేథా పేతిరాజ్, జయరామ్, టబు, సముద్ర ఖని వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు