Latest Telugu OTT Movies : ఈ వారం ఓటీటీలోకి వచ్చిన 5 తెలుగు సినిమాలు… వీకెండ్ లో డోంట్ మిస్

Latest Telugu OTT Movies : ఓటిటిలో ప్రతి వీకెండ్ కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అందులోనూ ఎవ్రీ వీక్ ఎన్ని కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని కౌంట్ చేసుకుంటున్నారు తెలుగు మూవీ లవర్స్. మే రెండవ వారం ఓటిటీలోకి పదుల సంఖ్యలో కొత్త సినిమాలు అడుగు పెట్టాయి. కానీ అందులో 5 మాత్రమే తెలుగు సినిమాలు ఉన్నాయి. మరి ఆ 5 సినిమాలు ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

1. గీతాంజలి మళ్లీ వచ్చింది

అంజలి హీరోయిన్ గా నటించిన కామెడీ హారర్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ మూవీ ఇదే వారంలో రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ మే 8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండగా, మే 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైంది.

2. లవ్ గురు

తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ బిచ్చగాడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈ హీరో నటించిన రోమియో అనే తమిళ మూవీ తెలుగులో లవ్ గురు అనే పేరుతో రిలీజ్ అయింది. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెల కూడా గడవకముందే ఓటిటిలోకి అడుగు పెట్టింది. తెలుగు వర్షన్ లవ్ గురు మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు మిగతా భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

3. సిట్

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ నేపథ్యంలో రూపొందిన సిట్ మూవీ జీ5 లో మే 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ థియేటర్లలోకి కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సిట్ మూవీ లో అరవింద్ కృష్ణ, రుచిత సాదినేని ప్రధాన పాత్రలు పోషించారు.

4. చిత్రం చూడరా

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన మూవీ చిత్రం చూడరా ఈటీవీ విన్ లో మే 9న స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూడా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటిటిలో రిలీజ్ అయింది. చిత్రం చూడరా మూవీకి ఆర్ఎస్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు.

5. ఆవేశం

ఫహాద్ ఫాజిల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ఆవేశం మూవీ మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక వీటితో పాటే తమిళ సినిమాకు తెలుగు వెర్షన్ గా వచ్చిన పార్ధు మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మే 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అర్జున్ ఏకలవ్యన్  దర్శకత్వం వహించారు. పార్ధు మూవీ లో మైకేల్ తంగదురై, జయ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఇంకా ఈ సినిమాలను ఎవరైనా చూడకపోతే ఈ వీకెండ్ డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు