RRR: ఆస్కార్ ద్వయానికి  టాలీవుడ్ గౌరవ సన్మానం..!

RRR సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కటంతో మన తెలుగు సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీరవాణి, చంద్రబోస్ లకు సన్మానం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 9న శిల్పకళా వేదికలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీఎఫ్పీసీసీ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలిపింది. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు, మరియు సాంకేతిక నిపుణులు, హాజరు కానున్నట్టు తెలిపింది. తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సన్మాన కార్యక్రమం ఓ మంచి జ్ఞాపకం, గర్వించదగిన ఉత్సవం కానుందని పేర్కొంది ఫిలిం ఛాంబర్.

తెలుగు పాట ఆస్కార్ స్థాయికి వెళుతుందని ఎవరూ కల్లో కూడా ఉహించి ఉండరు. అలాంటిది మన పల్లె వాసనలతో అచ్చ తెలుగు పదాలతో నిండిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావటం ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం. ఉత్తరాదిన అణిచివేతకు గురికాబడ్డ మన తెలుగు పాట ఏకంగా ఆస్కార్ వేదికపై వినిపించటం తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన అంశం.

ఈ ఘనత సాధించిన సుస్వరవాణి కీరవాణి, సరస్వతి పుత్రుడు చంద్రబోస్ లు కారణ జన్ములు అని చెప్పవచ్చు. తెలుగు సాహిత్యానికి, సంగీతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ఈ ఇద్దరిని సన్మానించుకోవడం పరిశ్రమ బాధ్యత. ఈ ప్రోత్సాహంతో మన తెలుగు పరిశ్రమ నుండి ఇలాంటి అద్భుతాలు మరిన్ని రావాలని ఆశిద్దాం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు