Nikhil Siddhartha : ఆ ప్రత్యేకమైన స్థలం వద్ద టీజర్ ను లాంచ్ చేయనున్న చిత్ర బృందం

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “స్పై“. గ్యారీ బీహెచ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను “ఈడీ ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో కే. రాజేశ్వర రెడ్డి నిర్మిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఈ మూవీలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పై మూవీస్ జోనర్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా సినిమా పేరే “స్పై” అని పెట్టారు. అయితే చాలా నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను జూన్ 29 విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ మెల్లిగా ప్రమోషన్స్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్, పోస్టర్ ఇమేజ్ లు సినిమాపై అంచనాలను పెంచేసాయి. తాజాగా “స్పై” సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ ను మూవీ టీమ్ తెలియచేశారు.

“స్పై” మూవీ కి సంబంధించిన అఫిషియల్ టీజర్ ను మూవీ టీమ్ ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ దగ్గర లాంచ్ చేస్తున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే “స్పై” సినిమా “నేతాజీ సుభాష్ చంద్రబోస్” జీవితానికి సంబంధించిన ఒక మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతుందని సమాచారం. అందువల్ల ఈ సినిమా యొక్క టీజర్ ని మే15 న ఢిల్లీలోని “కర్తవ్య పాథ్” దగ్గర నేతాజీ విగ్రహం వద్ద లాంచ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. అయితే ఈ ఐకానిక్ ప్లేస్ లో మొట్ట మొదటిసారిగా ఇలా టీజర్ లాంచ్ చేస్తుండడం విశేషం. ఇంతకు ముందు ఏ మూవీ కి సంబంధించిన ఈవెంట్ కూడా ఇక్కడ జరగలేదు. ఈ ఘనత “స్పై” మూవీకి దక్కింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న “స్పై” సినిమాపై అంచనాలు పెంచడానికి ఇలాంటి ఐకానిక్ ప్లేస్ లో టీజర్ లాంచ్ బాగా ప్లస్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు