Sithara Entertainments : అందర్నీ లైన్లో పెడుతున్న నాగవంశి.. ఇది మామూలు రచ్చ కాదు!

Sithara Entertainments : టాలీవుడ్ లో ఇప్పుడు ఓ రేంజ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిర్మాత ఎవరంటే అది నాగవంశీ అనే చెప్పాలి. మొన్నటివరకు మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే సినిమాలతో బిజీ గా కనిపించింది. కానీ ఈ ఇయర్ 2024 లో సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించిన సినిమాల లెక్క చూస్తే మతి పోతుంది. చూస్తుంటే టాలీవుడ్ లో అందరు హీరోలని అతి త్వరలోనే మొత్తం నాగవంశీ కవర్ చేస్తాడని అనిపిస్తుంది. ఇక ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం ఆశించిన ఫలితం గాని, పూర్తి సంతృప్తిని ఇవ్వకపోయినా, కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో సితార నిర్మాత నాగ వంశి ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు వరుసగా సినిమాలు తీయడంలో మైత్రి మూవీ మేకర్స్ దూకుడుగా ఉందని చాలా మంది అనుకున్నా, వాళ్ళు పెద్ద సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ చూపుతున్నారని తెలుస్తుంది. కానీ సితార మాత్రం చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా చాలా మంది హీరోలని లైన్లో పెట్టింది.

పక్కా ప్లానింగ్ తో..

ఇక ఈ ఇయర్ ఆల్రెడీ రెండు సినిమాలు సితార(Sithara Entertainments) నుండి రిలీజ్ కాగా, తర్వాత భారీ బడ్జెట్, మీడియం రేంజ్ మూవీస్ తో సితార సైతం భారీ ప్రణాళికలు వేస్తోంది. సితార నుండి ఇప్పుడు ముందుగా విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ మే లో విడుదలకు రెడీగా ఉంది. గతంలో లాగాఈసారి ఎలాంటి వాయిదాలకు ఛాన్స్ కూడా లేదు. కంటెంట్ పట్ల మూవీ టీమ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న ‘లక్కీ భాస్కర్’ సగానికి పైగా పూర్తయ్యింది. హీరోతో పాటు వెంకీ అట్లూరి బ్రాండ్ బిజినెస్ పరంగా ఉపయోగపడుతోంది. ఇక నందమూరి బాలకృష్ణ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ‘NBK 109’ కూడా క్రేజీ అంచనాలున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ కు తగ్గట్టే బిజినెస్ కూడా సాలిడ్ గా కానుంది. వీలైతే ఈ దీపావళి లేదా వచ్చే సంక్రాంతికి బాలయ్య సినిమా తీసుకువద్దామని అనుకుంటున్నారట.

చిన్న సినిమాల్లో కూడా తగ్గేదేలే..

ఇక అంతా కొత్తవాళ్లతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న మ్యాజిక్ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక వేసవిలో మ్యాడ్ మూవి కి సీక్వెల్ గా ‘మ్యాడ్ మ్యాక్స్’ షూట్ ప్రారంభించబోతున్నారు. అదే క్యాస్టింగ్ ని కొనసాగిస్తూనే దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఫన్ డోస్ భారీగా పెంచబోతున్నాడు. అలాగే లేటెస్ట్ గా టిల్లు స్క్వేర్ సక్సెస్ తర్వాత ‘టిల్లు క్యూబ్’కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా అతి త్వరలో మొదలుకాబోతున్నాయి. ఇక రవితేజ హీరోయిన్ రుక్మిణి వసంత్ కాంబోలో అనుదీప్ దర్శకుడిగా ఒక ప్రాజెక్టు కూడా రాబోతుంది. అయితే దీనిపై మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించాల్సి ఉంది. తాజాగా అశోక గల్లా హీరోగా రూపొందే అతని మూడో సినిమా అనౌన్స్ మెంట్ కూడా సితార టీమ్ చెప్పడం జరిగింది. ఇది గాక సాయి దుర్గా తేజ్ తో కొన్ని నెలల క్రితం ప్రకటించిన గాంజా శంకర్ షూటింగ్ ఆగిపోయినా, త్వరలోనే మళ్ళీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఇవ్వన్నీ ఒక ఎత్తు అయితే విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరిల కాంబోలో వస్తున్న VD 12 ని విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ప్లాన్ చేశారట. ఈ లెక్కంతా చూస్తుంటే దాదాపు పది సినిమాలకి పైగానే ఉంటుంది. కానీ అన్ అఫిషియల్ గా మరిన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు