Ashok Galla : అమెరికా నేపథ్యంలో మహేష్ మేనల్లుడి మూవీ..

Ashok Galla : టాలీవుడ్ లో స్టార్ బ్యాక్ గ్రౌండ్ తో ఏంతో మంది హీరోలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తారు. వాళ్లలో నిర్మాతల కొడుకులు, దర్శకుల కొడుకులు, అలాగే హీరోల కొడుకులు, అల్లుళ్ళు, లేదా తమ్ముళ్లు హీరోలుగా తమ వారిలాగే సక్సెస్ అవుతామని నమ్మకంతో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందులో సక్సెస్ అయ్యేవాళ్ళు మాత్రం చాలా తక్కువ. కొంతమంది తొందరగానే క్లిక్ అయితే మరికొందరు కాస్త టైం తీసుకుంటారు. ఇంకొందరు స్టార్ కిడ్స్ ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక అలాంటి హీరోలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు యంగ్ హీరో అశోక్ గల్లా. ‘హీరో’ పేరుతో ఫస్ట్ మూవీ తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమాతో హిట్ ని అందుకోలేకయాడు. అందువల్ల కాస్త గ్యాప్ తీసుకుని చక్కని కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సరికొత్తగా అశోక్ గల్లా..

ఇక అశోక్ గల్లా నటిస్తున్న దేవకీ నందన వాసుదేవ లో సినిమాలో అశోక్ మాస్ అవతార్ లో కనిపించనున్నట్లు ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఈ మహేష్ మేనల్లుడి కొత్త మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అశోక్ గల్లా సినిమా రాబోతుంది. సితార బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. తాజాగా అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాను ప్రకటించడం జరిగింది. ఇక కలలు, వాస్తవాలు మధ్య చిక్కుకున్న యువకుల కథ అంటూ ఈ సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు ట్వీట్ చేశారు మేకర్స్. అలాగే ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రేమ, హాస్యం మేళవింపుతో ప్రస్తుత యువత మెచ్చే అందమైన స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇక ఈ పోస్టర్ ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తో ఉన్న స్టిల్ తో అనౌన్స్ మెంట్ పోస్టర్ వచ్చింది. దీన్ని బట్టి ఈ మూవీ స్టోరీ అంతా అమెరికాలో జరుగుతుందని అర్థమవుతోంది. ఈ సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా మ్యాడ్ మూవీ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ నటిస్తోంది. ఇటీవల లవర్ మూవీలో తన యాక్టింగ్ కు గాను ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

2025 లో సినిమా..

ఇక అశోక్ గల్లా(Ashok Galla) హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో ఉద్భవ్ అనే వ్యక్తి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అయితే ముందు ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోకపోగా, టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తున్న అగ్ర సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో నైనా అశోక్ గల్లా మంచి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమా మే లో మొదలై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందిట. అయితే సినిమాని మాత్రం 2025 లో రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు