కోలీవుడ్కు సమానంగా టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుల్లో హీరో ధనుష్ ఒకడు. రఘువరన్ B-Tech సినిమాతో టాలీవుడ్లో ఈయనకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం తరువాత ధనుష్ నటించిన సినిమాలన్నింటిని తమిళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ ఐదు సినిమాలను లైన్లో పెట్టాడు.
ఈయన డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు. తెలుగులో రెండు సినిమాలను చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించాడు. ఈ చిత్రం పట్టాలెక్కక ముందే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు. సార్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. టేబుల్పై కూర్చొని విద్యార్థులకు క్లాస్ పీకుతున్నట్టు ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో ధనుష్ జూనియర్ లెక్చరర్గా కనిపించనున్నాడు. ధనుష్కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. జీ వీ. ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ధనుష్ బాలయ్యకు ఎంతగానో కలిసి వచ్చిన డేట్ రోజే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అఖండ సినిమా గత ఏడాది డిసెంబర్ 02న విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. అదే రోజు రాబోతున్న ‘సార్’ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు అదే రోజున అడివిశేషు హిట్ 2 కూడా విడుదల కానుంది. ఈ రెండింటిలో ఏ సినిమా హిట్ అవుతుందో వేచి చూడాలి.