ప్రముఖ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి అందరికీ తెలిసిందే. 2000 పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక అదే ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన ‘బద్రి’ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పేరిగి ప్రేమకు దారి తీసింది. అలా వారు పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పెళ్లి తరువాత కేవలం పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే నటించింది రేణుదేశాయ్.
చాలా ఏళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రేణు దేశాయ్ మళ్లీ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో కొద్ది రోజుల కిందట తాను ఆద్య అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా మరో సినిమాలో కూడా నటించేందుకు సిద్ధమయ్యారు. మాస్ మహారాజా రవితేజ చిత్రంతో వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రవితేజ్కు అక్క పాత్రలో నటించనున్నట్టు సినీ వర్గాల టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్కి అకీరా నందన్, ఆధ్యా ఇద్దరు పిల్లలు. ఆ తరువాత ఈమె, పవన్ విడిపోయారు. మరోవైపు రేణుదేశాయ్ ఒప్పుకున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందించనుంది. 1970 నేపథ్యంలో సాగిన కథ ఇది. స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతుంది. రవితేజ ఈ చిత్రం కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకోనున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసతో ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండడం విశేషం.