ప్రామిసింగ్ టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ తన 26వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో పెంగ్విన్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం మల్టీస్టారర్గా రాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో ఫేమ్ సాధించిన కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో కీలక పాత్రలో నటించబోతున్నాడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే..? ధనంజయకి కూడా ఈ చిత్రం 26వ సినిమా కావడం విశేషం.
ఇక వీరు ఇద్దరూ ప్రతిభ వంతులైన హీరోలు ఒకే సినిమాలో స్క్రీన్ స్పేస్ను పంచుకుంటే చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డాలీ ధనంజయ కి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ లో గుర్రంతో పాటు తుపాకి, బుల్లెట్లు, కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు సత్యదేవ్ పోస్టర్లో ఎరుపు రంగు థీమ్ హైలెట్ అవుతోంది. ధనంజయ పోస్టర్ లో మాత్రం గ్రే థీమ్ హైలెట్ అయిందనే చెప్పవచ్చు.
క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటించబోతున్నారు. ఇది డైరెక్టర్ తెలుగు సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ తొలి నిర్మాణంగా రాబోతున్న ఈ చిత్రాన్ని బాల సుందరం, దినేష్ సుంరం నిర్మించనున్నారు. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు.