Saindhav: ఒక్క పాటతో హీరో హీరోయిన్ల బాండింగ్ చూపించిన శైలేష్ కొలను!

టాలీవుడ్ లో ఈ సంక్రాతి కి రాబోతున్న క్రేజీయెస్ట్ సినిమాల్లో ‘సైంధవ్‌’ కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మించడం జరిగింది. ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇక సంక్రాంతికి ఇంకా నెల రోజులే టైం ఉండడంతో సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టిన చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు వెంకీ అభిమానుల్లో ఉన్నాయి. దానికి తోడు వెంకీ 75 సినిమా కావడం, సినిమా టీజర్ కూడా అదిరిపోవడంతో సైంధవ్‌ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ కాగా, తాజాగా ఓ మెలోడీ సాంగ్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. “సరదా సరదాగా” అంటూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ ని రామ జోగయ్య శాస్త్రి రాయగా, అనురాగ్ కులకర్ణి పాడడం జరిగింది.

- Advertisement -

సంతోష్ నారాయణ్ అందించిన మెలోడీ ట్యూన్స్ తో సాంగ్ ఆడియన్స్ ని మెప్పించగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య బాండింగ్ ని కూడా డైరెక్టర్ శైలేష్ కొలను అందంగా చూపించాడు. ఇక సినిమాలో వెంకీ, శ్రద్హా శ్రీనాథ్ మధ్య సీన్లు కూడా కొన్ని ఈ పాటలో బిట్లు గా చూపించాడు. అయితే పాట స్టార్ట్ అయ్యే ముందు వెంకటేష్ కూతురికి శ్రద్ధా తల్లి కాదు అని రివీల్ చేసేసాడు డైరెక్టర్. అయితే ఆ పాప కోసం వీళ్ళిద్దరూ పేరెంట్స్ ఎలా అయ్యారో, ముఖ్యంగా సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య బాండింగ్ ని కూడా శైలేష్ కొలను చాలా బాగా చూపించాడు. మరి సినిమా రిలీజ్ అయ్యే లోగా సైంధవ్‌ ఆడియన్స్ లో ఇంకెంత హైప్ పెంచుతాడో చూడాలి.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు