Sameera Reddy: తొలిసారి చూడగానే ఇష్టపడ్డాను

సమీరా రెడ్డి.. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్ లో గట్టిగానే వినిపించింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి జై చిరంజీవ, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అశోక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది సమీరారెడ్డి. తన అందం, అభినయంతో కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంది. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమె సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. తాజాగా తన పెళ్లి సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను వివరించింది. 2014లో సమీరా రెడ్డి ప్రముఖ బిజినెస్మెన్ అక్షయ్ వార్దేతో ఏడడుగులు నడిచింది.

వీరిది ప్రేమ వివాహం. పెళ్లికి ముందే సమీరా రెడ్డి అక్షయ్ తో రెండు సంవత్సరాలు డేటింగ్ చేసింది. అనంతరం పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా సమీరా రెడ్డి మాట్లాడుతూ.. ” అక్షయ్ వార్దేతో ప్రేమ, పెళ్లి నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. నిజానికి అక్షయ్ ని తొలిసారి చూడగానే ఇష్టపడ్డాను. మొదట నేనే నెంబర్ అడిగి తీసుకున్న. అక్షయ్ చాలా సపోర్టివ్. నేను మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు అండగా ఉన్నాడు. నన్ను చాలా ప్రోత్సహించాడు. తనే పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చాడు. రెండు కుటుంబాల ఆమోదంతో మా వివాహం ఘనంగా జరిగింది. నాకు కొంచెం కోపం ఎక్కువ. కానీ అక్షయ్ ఎప్పుడూ కూల్ గా ఉంటాడు” అని చెప్పుకొచ్చింది సమీరా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు