టాలీవుడ్ బ్యూటీ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. యశోద సినిమా షూటింగ్ సమయంలో సమంత మయోసైటిస్ భారిన పడటంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాల్లో చికిత్స తీసుకుంది. ఆ తరవాత కోలుకుని ఖుషి, శాకుంతలం సినిమాలను పూర్తి చేసింది. ఈ సినిమాల షూటింగ్ తరవాత మరోసారి గ్యాప్ తీసుకుంది. వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ ఆరోగ్యం కోసం సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే సినిమాలను ఇక సామ్ కేవలం హాలోపతీ మాత్రమే కాకుండా ప్రకృతి వైద్యం కూడా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బూటాన్ కు వెళ్లింది. ఇక మిగితా హీరోయిన్లతో పోలిస్తే సమంత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రతి విషయాన్ని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. మొన్న గడ్డ కట్టించే మంచులో చికిత్స తీసుకుంటున్నట్టు ఫోటోను షేర్ చేసింది.
ఇక తాజాగా సమంత తాజాగా బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో బాత్ టబ్ లో స్నానాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రకృతి అందాలను చూపిస్తూనే… తన అందాలను ఆరాబోస్తుంది. ఇక మరో ఫోటోలో టవల్ తో పోజులు ఇచ్చింది. తన ఫోటోలకు ఇన్ స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సామ్ ఈ ఫోటోల్లో హాట్ గా కనిపిస్తుందని, బాత్ టబ్ ఫోటోలు షేర్ చేస్తుందని తాము అనుకోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సమంత గత రెండు రోజులుగా బజార్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఫోటోలలో సమంత అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఫోటోలతో పాటూ తాజాగా షేర్ చేసిన బాత్ టబ్ ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో సమంత ఆరోగ్యం కుదుటపడిందని నెటజన్లు అనుకుంటున్నారు. మరోవైపు సామ్ అభిమానులు ఆమె పూర్తిగా కోలుకోవాలని త్వరలో సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.
Check Filmify Telugu for the most recent upcoming movie updates and celebrity News from all Film Industries. Also get the latest tollywood updates, celebrity photos, beautiful pics of heroines & heros, latest Bollywood Gossip at Filmify.