Samantha : వెన‌క్కి తగ్గాను.. ఓడిపోలేదు

అక్కినేని నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట టాలీవుడ్ లో బెస్ట్ క‌పుల్స్‌గా కొన‌సాగారు. దాదాపు ఏడేళ్ల ప్రేమించుకుని 2017లో వీరు పెళ్లితో ఒక్క‌ట‌య్యారు. 2021 అక్టోబ‌ర్ నెల‌లో వీరు విడాకులు ప్ర‌క‌టించి అంద‌ర‌నీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. విడాకుల త‌రువాత నాగ‌చైత‌న్య, స‌మంత ఇద్ద‌రూ కూడా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. విడాకుల త‌రువాత స‌మంత అయితే ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటేడ్ సినిమాల‌ను ఎక్కువ‌గా చేస్తుంది.

విడాకుల‌కు ముందు స‌మంత ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది. విడాకుల త‌రువాత సోష‌ల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది స‌మంత‌. ముఖ్యంగా నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్‌ని ఎదుర్కొంది. దీంతో ట్రోల‌ర్స్‌, నెగిటివ్ కామెంట్స్ కి భ‌య‌ప‌డి సోష‌ల్ మీడియాకి సమంత దూరం అయింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. కొంత‌కాలం నుంచి సోష‌ల్ మీడియాకి దూరంగా ఉన్న స‌మంత తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అగ్ర క‌థానాయిక స‌మంత ఇన్‌స్టాగ్రామ్ లో పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసింది. షేర్ చేసిన ఈ పోస్ట్‌కి “వెన‌క్కి తగ్గా.. కానీ ఓడిపోలేదు” అని క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఇది స‌మంత చేసిన ఈ పోస్ట్ పై ప‌లువురు సెలబ్రీటీలు మోర్ ప‌వ‌ర్ టూ యూ, బీస్ట్రాంగ్ అనే అర్థం వ‌చ్చేవిధంగా ఎమోజీల‌తో కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం ఆ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ముఖ్యంగా స‌మంత త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టింద‌ని అభిమానులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు