ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సమంత జెస్సీ క్యారెక్టర్ తో ఎంతో మంది కుర్ర కారును తన వైపుకు తిప్పుకుంది. అతి తక్కువ కాలంలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, వంటి స్టార్ హీరోలతో జతకట్టి మంచి హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. తన మొదటి సినిమా హీరో నాగచైతన్యతో కొంతకాలం ప్రేమలో ఉన్న సమంత పెళ్లి చేసుకుని రీసెంట్ గా విడాకులు తీసుకున్న విషయం విధితమే.
ఇటీవలే యశోద సినిమాతో మంచి హిట్ అందుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను పూర్తిచేసింది. సమంత ఇందులో శకుంతలగా గా కనిపించగా, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ పౌరాణిక ప్రేమ కథా చిత్రం ‘శాకుంతలం’ ను ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ తెరకెక్కించారు. ఈ ఎపిక్ లవ్ స్టోరి ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
విజువల్ వండర్గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా సమంత రెమ్యునరేషన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నా శ్రమ చూసి ‘మేము మీకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలనుకుంటున్నాం’ అని నిర్మాతలే చెప్పాలి. అంతేకానీ నాకు ఇంత పారితోషికం ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదు. మన కృషి ఆధారంగా అది వస్తుందని నమ్ముతాను. మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలి’ అని సమంత చెప్పుకొచ్చింది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News