Sai Dharam Tej : గుమ్మడికాయ కొట్టేసిన మేగా మేనల్లుడు

మెగా హీరోస్ లో సాయి ధర్మ తేజ్ ఒక ప్రత్యేకమైన హీరో. అందరికంటే ఎక్కువ ప్లాప్ సినిమాలు పడిన కూడా ఇప్పటికి సాయి ధర్మ తేజ్ సినిమా అంటే ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో ధర్మ తేజ్ చిత్రలహరి, ప్రతిరోజు పండగే, రిపబ్లిక్ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కి తో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమనేది చాలా సినిమా ఫంక్షన్స్ లో అర్ధమైపోతుంది. అయితే ప్రస్తుతం ఈ మెగా హీరోలు ఒకేసారి వెండితెరపై అలరించనున్నారు. ఈ సినిమా కాకుండా సాయి తేజ్ ప్రస్తుతం విరూపాక్ష సినిమాను చేస్తున్నాడు.

సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతో కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా విరూపాక్ష సినిమా తెరకెక్కుతుంది. తాజాగా చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా లో వెల్లడిస్తూ విరూపాక్ష చిత్రం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఆశ్చర్య పరిచే విజన్, నిరంతరం హార్డ్ వర్క్, టీమ్ ఫుల్ ఎఫర్ట్స్ విరూపాక్ష సినిమాను మెమరబుల్ గా, అద్భుతమైనదిగా మార్చినట్లు తెలిపారు. చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ కూడా థాంక్స్ తెలిపారు. ఏప్రిల్ 21న చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుందని తెలిపారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు