Raviteja: మాస్ మహారాజా కొత్త బిజినెస్… మహేష్, బన్నీకి గట్టి పోటీనే

టాలీవుడ్ స్టార్స్ కేవలం సినిమాల్లోనే కాకుండా బిజినెస్ మాన్లుగా మారి పలు వ్యాపార రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే, మరికొంతమంది నిర్మాతలుగా మారి కొత్త నటీనటులు, దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఇంకా కొంతమంది రెస్టారెంట్లు నడిపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. వీళ్ళందరి కంటే డిఫరెంట్ గా ఆలోచించిన అల్లు అర్జున్, మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఇదే బాటలో వెళ్ళబోతున్నట్టు సమాచారం.

రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుసగా హ్యాట్రిక్ ప్లాపులను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ ఈ హీరోకు అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆర్టీ టీం వర్క్స్ పేరుతో స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ లో పలు సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన కన్ను మల్టీప్లెక్స్ బిజినెస్ పై పడిందని తెలుస్తోంది. ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో దిల్ సుఖ్ నగర్లో ఓ భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం జరగబోతుందని సమాచారం. ఈ మల్టీప్లెక్స్ లో ఏకంగా ఆరు స్క్రీన్లు ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది. ఇక ఈ భారీ థియేటర్ కు ART (Asian Ravi Teja) సినిమాస్ అని పేరు పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ స్థాపించగా, రీసెంట్ గా అల్లు అర్జున్ ఇదే బిజినెస్ లోకి దిగారు. గత ఏడాది అమీర్ పేట్ లో “AAA” సినిమాస్ పేరుతో బన్నీ మల్టీప్లెక్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా రవితేజ సినిమాల విషయానికి వస్తే… రీసెంట్ గా ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఫెయిల్ అయ్యింది. దీంతో ఈ మూవీ కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. “ఈగల్”ను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు దాదాపు 25 కోట్ల భారీ నష్టం వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రవితేజ “మిస్టర్ బచ్చన్” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తుండగా, ప్రస్తుతం కర్తేకుడిలో షూటింగ్ జరుగుతుంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు