Rashmika Ranbir Kapoor : మరోసారి రన్బీర్ సరసన రష్మిక మందన్న

Rashmika Ranbir Kapoor : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వచ్చిన అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వరకు వసూలు చేసింది. సినిమా కంటే ముందు తెలుగులో అర్జున్ రెడ్డి అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమైన సందీప్ రెడ్డి. మొదటి సినిమాతోనే చాలామందికి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసి తెలుగు సినిమా పరిశ్రమకు ఒక సంచలన దర్శకుడు దొరికాడు అనిపించుకున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిన తర్వాత అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తీసాడు.

కబీర్ సింగ్ సినిమా బాలీవుడ్లో సరికొత్త సంచలనానికి దారి తీసింది అప్పటికే హిట్స్ లేక సతమతమవుతున్న బాలీవుడ్ కి ఒక తెలుగు డైరెక్టర్ అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలు ఇవ్వటం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. చాలామంది ఆ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇస్తూ ఆ సినిమాను విమర్శించడం మొదలుపెట్టారు. ఆ సినిమాను కొంతమంది ఫిలిం అని కూడా చెప్పుకోచ్చారు. వీరందరికీ సమాధానంగా సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీళ్ళందరూ నా సినిమాను వైలెంట్ ఫిలిం అని అంటున్నారు అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను నా తర్వాత సినిమాతో చూపిస్తా అంటూ చెప్పుకొచ్చాడు.

సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన రెండవ సినిమా అనిమల్. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ రష్మిక మందన్న ( Rashmika Ranbir Kapoor ) హీరో హీరోయిన్గా నటించారు. పుష్ప సినిమాతో రష్మిక కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అంతకు మించిన గుర్తింపును తీసుకొచ్చింది. రష్మిక చేసిన గీతాంజలి అనే పాత్రకి మరెవరు సరిపోరు అనేటట్లు ఈ సినిమాలో నటించింది రష్మిక. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ కూడా అదే స్థాయిలో నటించాడు. సందీప్ రెడ్డి వంగ చెప్పినట్లు చాలా వైలెంట్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు సందీప్.

- Advertisement -

అయితే ఈ సినిమా చివర్లో అనిమల్ పార్క్ అని ఒక సినిమా రాబోతుంది ఆ సినిమా దీనికి సీక్వల్ గా ఉండబోతుందని అధికారికంగా ప్రకటించాడు సందీప్ రెడ్డి వంగ. అయితే ఈ సినిమాలో కూడా రన్బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న నటించబోతుంది. అయితే ఇప్పుడు మరోసారి రన్బీర్ సరసన రష్మిక నటించింది సినిమాలో కాదు ఒక సెవన్ అప్ యాడ్ లో. ఈ యాడ్ ను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది రష్మిక.

ఇకపోతే రన్బీర్ కపూర్ ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ పైన బిజీగా ఉన్నాడు. అలానే సందీప్ రెడ్డి వంగ యానిమల్ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు ప్రస్తుతం ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో కూర్చున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్లు ఇదివరకే చెప్పుకొచ్చాడు సందీప్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గురించి ఈ సినిమా ఉండబోతున్నట్లు ఒక హింట్ కూడా ఇచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు