రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. ముఖ్యంగా ఇటీవల అల్లు అర్జున్ పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించి యావత్ దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఓవర్ నైట్లో నేషనల్ క్రష్ పేరు సంపాదించుకుంది.
ప్రస్తుతం కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిమితం కాకుండా బాలీవుడ్లో సైతం ఈ అమ్ముడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతి నిండా ఫుల్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. బాలీవుడ్ సినిమా ‘గుడ్బై’ ప్రమోషన్లలో నటిస్తుంది. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రెడ్ చిత్రంలో ఈమె లిప్లాక్ సీన్కి సంబంధించి తనపై వచ్చిన ట్రోలింగ్స్ పై స్పందించింది రష్మిక.
ముఖ్యంగా అప్పట్లో తనపై వచ్చిన ట్రోల్స్ ని ఎలా అధిగమించానో తెలియడం లేదని వాపోయింది. తాను చాలా సున్నితమైన మనస్కు రాలిని అని చెప్పిన రష్మిక.. ఆ సీన్ గురించి కొంత మంది తనకు ఫోన్ చేసి అంతా బాగానే ఉందని చెప్పేవాళ్లని.. మరికొంత మంది మాత్రం దారుణంగా ట్రోల్ చేశారని చెప్పుకొచ్చింది. ఇక ‘ఆ సమయంలో నన్ను బాధించే సంఘటనలు చాలా జరిగాయి. రాత్రి పడుకున్నప్పుడు నేను ఎవరినో వేడుకుంటున్నట్టు కలలు వచ్చేవి. అందరూ నన్ను వెలివేసినట్టు కలలు వచ్చేవి. అలా కలలు వచ్చినప్పుడు ఉలిక్కిపడి నిద్రలేచి ఏడ్చేదాన్ని అని, అలా రాత్రి అంతా ఏడుస్తూ ఉండేదానిని’ అని చెప్పుకొచ్చింది రష్మిక.