Ranbir Kapoor: హీరోయిన్స్‌తో అలా చేసినా ఆలియా పట్టించుకోదు

యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే బాలీవుడ్ యాక్టర్లలో ఒకడు రణబీర్ కపూర్. ఈ స్టార్ యాక్టర్ ఓవైపు లవర్ బాయ్ గా కనిపిస్తూనే ఇంకోవైపు నటనకు ఆస్కారం ఉన్న ప్రయోగాత్మక సినిమాల్లో నటించేందుకు ఎప్పుడు రెడీగా ఉంటాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ హీరో శ్రద్దా కపూర్ తో తూ ఝూతి మైన్ మక్కార్ అనే సినిమా చేశాడు.

ఈ సినిమా హోళి సందర్భంగా మార్చి 8న రిలీజ్ అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే తూ ఝూతి మైన్ మక్కార్ సినిమాలో శ్రద్ధా కపూర్, రణబీర్ కపూర్ మధ్య చాలా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా, రణబీర్ కపూర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఈ హీరోకి పెళ్లయ్యాక పాప పుట్టాక కూడా రొమాంటిక్ కామెడీ సినిమాలు చేస్తారా ? చాక్లెట్ బాయ్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తారా ? అనే ప్రశ్న ఎదురయింది.

దీనికి రణబీర్ కపూర్ కాస్త డిఫరెంట్ గా ఆన్సర్ చేశారు. పెళ్లికి, రొమాంటిక్ సినిమాలకు సంబంధం లేదు గాని, ఇప్పుడు రొమాంటిక్ సినిమాలు ట్రెండ్ లేదన్నది నా ఫీలింగ్ అని చెప్పారు. స్క్రీన్ మీద హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటే ఆలియా ఒప్పుకోవట్లేదట కదా అనే ప్రశ్నకు కూడా సరదాగా స్పందించారు. ఆమె అంత చిన్న విషయాల గురించి పట్టించుకోదు.

- Advertisement -

షో బిజ్ గురించి తమ ఇద్దరికీ తెలియనిది ఏమీ లేదని ఇద్దరం ఇదే ఫీల్డ్ లో ఎదిగిన వాళ్ళమంటూ చెప్పుకొచ్చారు. అలాంటి చిన్న విషయాలను ఆలియా పట్టించుకోదని వివరించారు. తమ ఇలాంటి గాసిప్స్ వస్తాయని, వాటని విని నవ్వుకుంటుంటామని అన్నారు రణబీర్. కాగా, చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న రణబీర్, ఆలియా 2022 ఏప్రిల్ 14న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా ముంబైలో వీరి పెళ్లి జరిగింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు