Liger :ముంబై ఫ్లాట్ నుంచి పారిపోయిన పూరీ జగన్నాథ్

ఒకప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరుపొందిన పూరీ జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయింది. “ప్రపంచం మొత్తంలో ఒకే ఒక్క డైరెక్టర్ హీరో క్యారెక్టరైజేషన్ పై కథ రాయగలడు అతనే పూరి జగన్నాథ్” అని టాలీవుడ్ స్టార్ హీరోల నోళ్లతో పొగిడించుకున్న పూరీ జగన్నాథ్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఏ హీరో డేట్స్ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ టాప్ హీరోస్ నుంచి మొదలు పెడితే యంగ్ హీరో ల వరకు దాదాపు అందరితో పని చేసిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఢీలా పడిపోయాడు. హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన పూరీ జగన్నాథ్ గత కొద్దీ సంవత్సరాలుగా ఫ్లాప్ సినిమాలకి కేరాఫ్ గా నిలుస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా మినహాయిస్తే, ఈ మధ్య ఆయన చేసిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఇంకో సినిమా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

ఇక విషయానికొస్తే పూరీ జగన్నాథ్ రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో పూరీ జగన్నాథ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొద్దికాలంగా ఆయన హైదరాబాద్ కంటే కూడా ముంబై లోనే ఎక్కువగా ఉంటున్న విషయం అందరికి తెలిసిందే. నెలకి 10 లక్షలకి పైగా రెంట్ ఉండే ఈ ఫ్లాట్ ఉండే ఆయన, ప్రస్తుతం అంత రెంట్ ఇవ్వలేక ఆ ఫ్లాట్ ఖాళీ చేసి తన మకాం ని గోవా కి మార్చారని సమాచారం. ప్రస్తుతం ఆయన రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 సినిమా ప్లాన్ చేయగా ఈ సినిమా స్క్రిప్ట్ పనులన్ని గోవా లోనే చేస్తున్నారంట. అయితే రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత నుంచి ఇస్మార్ట్ శంకర్2 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. వచ్చే ఏడాది మహా శివరాత్రికి ఈ సినిమా విడుదలవనుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు