Priyamani : సౌత్ హీరోలపై ప్రియమణి సెటైర్లు… అందుకే అవకాశాలు రావట్లేదట

Priyamani : స్టార్ హీరోయిన్ ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ సినిమాల్లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంటుంది. నిజానికి ఈ బ్యూటీ కెరీర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంటే, సెకండ్ ఇన్నింగ్స్ లోనే జెడ్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రియమణి తనకు సౌత్ లో అవకాశాలు రాకపోవడం పట్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను సినిమాలో ఉంటే స్టార్ హీరోలను ఎవ్వరూ పట్టించుకోరు అంటూ చెప్పుకొచ్చింది. మరి ఇంతకీ ప్రియమణి కామెంట్స్ వెనక దాగున్న అంతరార్థం ఏమిటి? ఎందుకు ప్రియమణికి టాలీవుడ్ లో అవకాశాలు రావట్లేదు? అనే వివరాల్లోకి వెళితే…

ఆ భయంతోనే ప్రియమణికి నో ఛాన్స్ ?

హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటుంది. విలన్ మూవీతో బాలీవుడ్ కు పరిచయమైన ఈ చిన్నది చెన్నై ఎక్స్ప్రెస్, ఫ్యామిలీ మెన్ సినిమాలతో అక్కడ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక రీసెంట్ గా తెలుగులో భామాకలాపం వెబ్ సిరీస్, హిందీలో జవాన్, మలయాళంలో నేరు సినిమాలలో కీలక పాత్రల్లో నటించింది. ప్రస్తుతం మైదాన్ మూవీలో హీరోయిన్ గా కనిపించబోతోంది ప్రియమణి. 1952 నుంచి 62 మధ్యలో ఫుట్ బాల్ కోచ్ గా వ్యవహరించిన సయీద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా రూపొందుతోంది ఈ మూవీ. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా, ప్రియమణి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా ప్రమోషన్లలోనే ప్రియమణి సౌత్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోలతో మీరు ఎందుకు నటించలేకపోయారు ? అనే ప్రశ్న ఎదురయ్యింది ఈ బ్యూటీకి. దానికి ప్రియమణి స్పందిస్తూ ఆ ప్రశ్న తనను కాకుండా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ను అడగాలని సూచించింది. తనకు కూడా ఈ విషయం ఆశ్చర్యకరంగా అనిపిస్తుందని, అయితే దానికి తగ్గ సమాధానం తన దగ్గర లేదని వెల్లడించింది. కానీ కొంత మంది మాత్రం తను స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే వాళ్లను డామినేట్ చేస్తానని, తానే హైలెట్ అవుతానని అంటారని వెల్లడించింది. అయితే అందులో నిజం లేదని, అంతేకాకుండా ఈ విషయం మీద తాను ఎవ్వరిని తప్పు పట్టాలనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

అంతేకాకుండా ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలు, పాత్రలతో సంతృప్తిగా ఉన్నానని, ఖాళీగా ఉన్న సమయంలో వచ్చిన ప్రాజెక్టుల వల్ల తనకు మంచి పేరు దక్కిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకు ఎవరితో ఎలాంటి గొడవలు లేవని, ఎప్పుడూ ఎవరిని కలిసినా అందరూ చక్కగా పలకరిస్తారు, మాట్లాడతారని వివరించింది. అయితే వాళ్లతో నటించే అవకాశం మాత్రం ఎందుకో రాలేదని, ఈ విషయంపై కొన్నిసార్లు ఫీల్ అవుతుంటానని అన్నారు ప్రియమణి. మైదాన్ మూవీ రంజాన్ కానుకగా ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు