హీరోయిన్ ప్రణీత అంటే తెలియని వారుండరు. కన్నడ ‘పోర్కి’ అనే చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం అయింది. దీని తర్వాత తెలుగులో ఏం పిల్లడో ఏం పిల్లడో, బావ వంటి సినిమాలు చేసింది. కానీ అరుళ్ నిధి హీరోగా నటించిన ‘ఉదయన్’ అనే చిత్రం తో హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో కొంత మంది స్టార్ హీరోలతో నటించింది. కన్నడ, తెలుగులో కూడా ఈ భామ పలు సినిమాలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ చేసి మెప్పించింది.
‘హంగామా 2’ తో బాలీవుడ్ కు కూడా పరిచయమైంది ఈ భామ. ప్రముఖ పారిశ్రామిక వేత్త నితిన్ రాజు తో వివాహం తర్వాత ప్రణీత ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంది. గత ఏడాది జూన్ లో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చి తల్లి గా మారింది. అయితే ఈ భామ మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందని చాలా రోజుల నుంచి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రణీత సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
”ఒక తల్లి నా కర్తవ్యాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయడానికి రెడీ గా ఉన్నాను” అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది. దీంతో సినీ ఇండస్ట్రీకి నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది ప్రణీత.