Payal Rajput : గైడెన్స్ లేదు

పాయల్ రాజ్ పుత్ అన‌గానే మ‌న‌కు “RX 100” సినిమా ట‌క్కున గుర్తుకొస్తుంది. ఎందుకంటే అందులో ఆమె వినూత్నమైన నటనతో ప్రేక్షకులను ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గుర్తింపును సంపాదించుకుంది పాయల్. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. మధ్య మధ్యలో ఐటమ్ సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మెప్పించింది.

మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం “జిన్నా”. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారానే ఇషాన్‌ సూర్య డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మీడియాతో చిట్ చాట్ చేసింది.

ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ..” అనగనగా ఓ అతిథి సినిమాలో నా యాక్టింగ్ ని చూసి మోహన్ బాబు సార్ నాకు ఒక రోజు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఆ తర్వాత నాకు జిన్నాలో పనిచేసే అవకాశం దొరికింది. ఈ సినిమాలో నేను పచ్చళ్ళు అమ్ముకునే గ్రామీణ యువతీగా కనిపిస్తాను. ఈ సినిమా కోసం విష్ణు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. ఈ చిత్రంలో సన్నీలియోన్ చాలా కీలకంగా సాగే పాత్రలో కనిపిస్తుంది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత నాకు సరైన గైడెన్స్ దొరకలేదు. ప్రస్తుతం సినిమాలకు ఓకే చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నాను. ఇకనుంచి నన్ను మంచి పాత్రలలో చూస్తారు”. అంటూ చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు