Pathan: ఎస్.ఆర్.కె పై కంగనా ప్రశంసలు

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ సూపర్ స్టార్, బాద్షా షారుఖ్ ఖాన్. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

ఇండియా ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో పాకిస్తాన్ జనరల్ ఖాద్రి ఇండియా పై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఎవరు ఊహించని విధంగా ఇండియాలో శాంతిభద్రతలను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో భారతదేశానికి చెందిన స్పై.. పఠాన్ (షారుక్ ఖాన్ ) ఎంట్రీ ఇచ్చి వారి ప్లాన్ ని ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రంలో హీరోయిన్ దీపికా పదుకొనే తన అందాలను ఆరబోయడమే కాదు.. యాక్షన్ సన్నివేశాలలో సైతం అదరగొట్టింది.

ఇక విలన్ గా నటించిన జాన్ అబ్రహం తన నటనతో ఆకట్టుకున్నాడు. విడుదలైన తొలిరోజే ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక బాలీవుడ్ పనైపోయింది అనుకున్న తరుణంలో పఠాన్ మూవీ మళ్లీ ఆశలు రేపింది. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది.

- Advertisement -

కంగనా తన ఎమర్జెన్సీ మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో మాట్లాడుతూ.. ” పఠాన్ మూవీ బాగా ఆడుతుంది. ఇలాంటి సినిమాలే ఇప్పుడు బాలీవుడ్ కి కావాలి. హిందీ సినిమా వాళ్లు వెనకబడిపోయిన ఈ సమయంలో ప్రతి ఒక్కరు తమ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు” అని చెప్పుకొచ్చింది. సౌత్ సినిమాల హవాతో హిందీ సినిమాలు కొట్టుకుపోతున్న సమయంలో పఠాన్ బాలీవుడ్ లో కొత్త ఆశలు రేపిందనడంలో సందేహం లేదు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు