NTR : ఫోటోగ్రాఫర్ పై ఎన్టీఆర్ ఫైర్.. వీడియో వైరల్.!

NTR : టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన ఒక్కొక్క సినిమాతో తన రేంజ్ ను సైతం పెంచుకుంటూ వెళ్తూనే ఉన్నారు ఎన్టీఆర్.. చివరిగా RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర, వార్ -2 వంటి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ హైదరాబాదులో పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. అలాగే మొట్టమొదటిసారిగా బాలీవుడ్లో నటిస్తున్న వార్ -2 సినిమా షూటింగ్ కి ముంబైకి వెళ్లినట్టుగా సమాచారం.

ఫోటోగ్రాఫర్ పై ఎన్టీఆర్ ఫైర్..

ఇటీవలే వార్-2 సినిమా మొదటి షెడ్యూల్ కూడా ఇటీవలే పూర్తి చేశారు.. ఇప్పుడు తాజాగా మళ్ళీ సెకండ్ షెడ్యూల్ కోసం ముంబైకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ముంబైలో ఉన్న ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ వీడియోలో ఎన్టీఆర్ ఫోటోగ్రాఫర్స్ పైన కాస్త ఫైర్ అయినట్టుగా కూడా కనిపిస్తోంది.. ఫోన్ మాట్లాడుతూ ఏదో హోటల్లోకి వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్ ను ఫోటోను తీసేందుకు సైతం అక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆయన వెనకాల పడగా.. తన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తూ ఉండడంతో వెంటనే ఫైర్ అయినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.

కోపానికి అసలు కారణం ఇదే..

అయితే కేవలం ఎన్టీఆర్ ఈ వీడియోలో ఓయ్ అంటూ వారి పైన కాస్త అరిచినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఎన్టీఆర్ కూడా ఇలా చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే వార్ -2 లో ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారని.. ఆ లుక్ ని సీక్రెట్ గా ఉంచడం కోసమే ఎక్కడ ఫోటోలు బయటపడకుండా చూసుకుంటున్నట్టు సమాచారం. కానీ ఎక్కడో ఒకచోట మాత్రం ఫోటోగ్రాఫర్లు ఎన్టీఆర్ పర్మిషన్ లేకుండానే పలు రకాల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ కాస్త సీరియస్గా అవ్వాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. వార్ -2 చిత్రం స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాల అయిపోయిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు ఎన్టీఆర్.

- Advertisement -

ఎన్టీఆర్ కెరియర్..

ఎన్టీఆర్ విషయానికి వస్తే నందమూరి కుటుంబం ఒకవైపు ఆయన ఒకవైపు అన్నట్లుగా ప్రస్తుతం కొనసాగుతోంది .ప్రస్తుతం నందమూరి ,నారా కుటుంబాలు రాజకీయాలలో సత్తా చాటున ప్రయత్నిస్తుంటే తనకు ఏ సంబంధం లేదు అన్నట్టు సైలెంట్ అయిపోయారు ఎన్టీఆర్.. ప్రస్తుతం తన ప్రకటించిన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఈయన వరుస సినిమాలతో అటు నార్త్ ఇటు సౌత్ అంటూ బిజీగా మారుతున్నారు ఎన్టీఆర్ మరి ఏ సినిమా ఈయనకు ఎటువంటి గుర్తింపును అందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు