Rules Ranjann: సైలెంటైపోయిందనుకున్నారు.. సైలెంట్ గానే పూర్తి చేసేస్తోంది

నేహా శెట్టి. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టరేమో గాని, డీజే టిల్లు రాధికా అంటే మాత్రం ఇట్టే పట్టేస్తారు. ఆ పాత్ర అలాంటిది మరి. మంగుళూరు కు చెందిన ఈ కన్నడ బ్యూటీ మొదట కన్నడలోనే హీరోయిన్ గా అడుగుపెట్టినా, గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగులోనే. 2018 ఆకాష్ పూరి హీరోగా వచ్చిన మెహబూబా సినిమా తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ హీరోయిన్. అయితే మొదటి సినిమా ప్లాప్ అయినా తన గ్లామర్ తో ఆకట్టుకోవడంతో ఆఫర్లు తలుపుతట్టాయి. సందీప్ కిషన్ “గల్లి రౌడీ” లో హీరోయిన్ గా చేసినా అది కూడా అంతగా ఆడలేదు. ఇటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ద్వారా హిట్ వచ్చినా అందులో తాను సైడ్ రోల్ మాత్రమే చేసింది. ఇలాంటి టైమ్ లో డీజే టిల్లు ద్వారా సాలిడ్ బ్రేక్ వచ్చింది.

2022 లో సిద్ధూ జొన్నల గడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించి, తన గ్లామర్ తో యూత్ ని పడగొట్టింది. పాత్ర కొంచెం నెగిటివే అయినా ఆ మచ్చ రాకుండా తన అందచందాలతో ఆడియన్స్ ని ఆకట్టుకోగలిగింది. అయితే డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ హీరోయిన్ కి పెద్ద సినిమాల్లో ఛాన్సులొస్తాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. డీజే టిల్లు విడుదలై సంవత్సరం అయినా తెలుగులో ఎక్కడ నేహా శెట్టి జాడే లేదు. తాజాగా డీజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న సినిమాలో కూడా ఈ హీరోయిన్ నటించట్లేదని తేలిపోయింది. కాబట్టి ఈ భామ వేరే ఇండస్ట్రీ కి వెళ్లిపోయిందనుకున్నారంతా. కానీ అలా జరగలేదు.

తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న రూల్స్ రంజన్ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని, ఇటీవలే విడుదలైన ‘నాలో నేనే లేను’ పాట ద్వారా తెలిసింది. అంతే కాదు కార్తికేయ నటిస్తున్న బెదురులంక లో కూడా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇవిగాక విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో కూడా ఈ భామే హీరోయిన్. డీజే టిల్లు తర్వాత సైలెంట్ అయ్యే సరికి అందరు వేరే ఇండస్ట్రీ వైపు మొగ్గు చుపిందనుకున్నారు. కానీ అంతే సైలెంట్ గా తెలుగులో సినిమాలు చేస్తుందనుకోలేదు. ఈ మూవీస్ గనుక హిట్ అయితే నేహా శెట్టికి వేరే ఇండస్ట్రీకి వెళ్లే అవసరం ఉండదు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు