సౌత్ ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరైన నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్ నెలలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్న నాలుగు నెలల్లోనే కవల పిల్లలకు జన్మనిచ్చింది లేడీ సూపర్ స్టార్. తాము తల్లిదండ్రులం అయ్యామని, తమకు కవల పిల్లలు అంటూ సర్ ప్రైజింగ్ స్టేట్మెంట్ ఇచ్చి జనాన్ని పరేషాన్ చేశారు నయన్ భర్త విఘ్నేష్ శివన్. పెళ్లి జరిగిన కేవలం నాలుగు నెలల్లోనే ఈ జంట తల్లిదండ్రులు కావడం ఏంటని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
మరోవైపు కొందరూ సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనిచ్చారంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే.. “నయన్, నేను అమ్మ, అప్పగా మారాం. మాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. మా ప్రార్థనలు, మా పూర్వికుల ఆశీర్వాదాలు అన్ని మంచి అభివ్యక్తులతో కలిపి మాకు రెండు ఆశీర్వాదాలు శిశువుల రూపంలో కలిసి వచ్చాయి. మా కోసం మీ అందరి ఆశీస్సులుండాలి. మీరు మా జీవితంలో ఎన్నో వెలుగులు నింపుతారని ఆశీస్తున్నాం. దేవుడు డబుల్ గ్రేట్” అని రాసుకొచ్చాడు.
ఇటీవలే ప్రియాంక చోప్రా కూడా సరోగసీ ద్వారా తల్లి అయిన విషయం అందరికీ తెలిసిందే. నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులకు కవల పిల్లలు పుట్టడంతో సోషల్ మీడియాలో అనూహ్యంగా ఎన్టీఆర్ పేరు ట్రెండ్ అవుతోంది. అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కవల పిల్లలు పుడుతారని ముందే గెస్ చేశారంటూ.. సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.