నభా నటేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చేసినవి కొన్ని సినిమాలైనా, తనదైన గ్లామర్ మరియు యాక్టింగ్ తో యూత్ కు ఆరాధ్య హీరోయిన్ అయింది. తెలుగులో మాస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. దీంతో వీలైనప్పుడల్లా స్కిన్ షో చేస్తూ హీరోలు, దర్శక నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్.
దానికి ముందు చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో ఆ అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే 2021 తర్వాత ఆమె సినిమాలేవి విడుదల కాలేదు. కొత్త సినిమాలను అంగీకరించలేదు. దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు. దీనికి ఇప్పుడు సమాధానం దొరికింది. 2022లో నభా నటేష్ కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం వాల్ల ఆమె ఎడమ చేతికి, ఎడమ భుజానికి గాయాలయ్యాయి. ఈ కారణంగా చాలా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. తనకు యాక్సిడెంట్ జరిగిన విషయాల్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది నభా. ఇప్పుడు కోల్కుంటున్నట్లు 2023లో సినిమాలు చేయనున్నట్లు తెలిపింది. కాగా నభా నటేష్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆమె త్వరగా కోలుకోవాలని, ఎప్పటిలాగే సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News