2022లో విడుదలైన చిత్రాలలో ‘డీజె టిల్లు’ ఒక సంచలనం. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకి వచ్చిన డీజే టిల్లు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ రొమాంటిక్ క్రైమ్ డ్రామా ఊహించని వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. మరోవైపు హీరోయిన్ నేహా శెట్టి గ్లామర్, నటన అబ్బురపరిచాయి.
దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా “టిల్లు స్క్వేర్” అని తీయబోతున్నట్లు గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించబోతున్నట్లుగా ఓ చిన్న టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత స్పష్టమైన కారణాలు తెలియదు కానీ ఈ చిత్రం నుండి అనుపమ పరమేశ్వరన్ తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికైందని, ఆ తర్వాత ఆమె కూడా సినిమా నుంచి వెనక్కి వచ్చేసిందని.. ఆ తర్వాత శ్రీ లీల ఇలా పలు రకాల వెబ్సైట్స్ లలో పలు వార్తలు చెక్కర్లు కొట్టాయి.
అయితే వీటిపై ఎక్కడా స్పందించని అనుపమ తాజాగా ఓ పోస్ట్ తో పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ వారు తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా టిల్లు స్క్వేర్ మూవీ షూట్ విరామ సమయంలో హీరో సిద్దు, హీరోయిన్ అనుపమల సరదా వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సిద్దు జొన్నలగడ్డ జుట్టుకి జెల్ క్రీం రాస్తూ కనిపించింది అనుపమ.
ఇది నా ప్రత్యామ్నాయ వృత్తి అంటూ అనుపమ కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారడంతో.. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ డిజెటిల్లు సీక్వెల్ లో నటిస్తోందని కన్ఫార్మ్ అయింది. ఇక డిజె టిల్లు కి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ కి రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
డీజే టిల్లు సీక్వల్ ఎలా ఉండబోతుందో అని, ఈసారి ఎంత ఎంటర్టైన్ చేస్తుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News