Mrunal : పెళ్లితో పనిలేదు.. పిల్లల్ని కంటాను

ఎన్నాళ్ల నుండో బాలీవుడ్ భామ మృనాల్ ఠాగూర్ ఎదురుచూసిన సక్సెస్ టాలీవుడ్ లో ” సీతారామం” రూపంలో వచ్చేసింది. టాలీవుడ్ లో అరంగేట్రం చేసి సీతారామంతో ఆమె ప్రశంసలు అందుకుంది. సీతామహాలక్ష్మి గా ప్రిన్సెస్ నూర్జహాన్ గా మృనాల్ నటనకు ఫిదా కాని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాతో మృణాల్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ 30లో తారక్ సరసన మృణాల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రూపొందించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుంది. ఈ మూవీలో మృనాల్ అయితే సేఫ్ అని ఆమెను ఫైనల్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

అయితే తాజాగా మృనాల్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ గా నిలిచాయి. 30 ఏళ్ల వయసున్న స్త్రీలు డేటింగ్, ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి ఆసక్తిగా ఉండరు అనే అంశంపై స్పందించింది. ” నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. నా మనసుని అర్థం చేసుకొని, నా మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే వ్యక్తి నా భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నా. అతడు నా వృత్తిని కూడా గౌరవించాలి. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే పెళ్లి చేసుకోను. కానీ నాకు పెళ్లి పై పెద్దగా ఆసక్తి లేదు. కానీ పిల్లలు అంటే ఇష్టం. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశ. ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా పిల్లల్ని కంటాను”. అంటూ మృణాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు