Vimanam: పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న కేరళ కుట్టి

కేరళకుట్టి మీరా జాస్మిన్.. అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యి “భద్ర” సినిమాలో “అను” గా యూత్ కి దగ్గరైంది ఈ భామ. ఎక్స్ పోసింగ్ కు దూరంగా ఉండే అతి తక్కువ మంది హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. మీరా జాస్మిన్ తెలుగులో చీరకట్టులోనే ఎక్కువ సినిమాల్లో కనిపించడం విశేషం. గుడుంబా శంకర్, పందెంకోడి, గోరింటాకు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఎక్కువగా తమిళ మలయాళ సినిమాల్లోనే నటించింది. అయితే 2014లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న మీరా జాస్మిన్ తర్వాత సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చింది.

పెళ్లి చేసుకున్న రెండేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అయితే తమిళ, మలయాళ సినిమాల్లోనే నటిస్తూ టాలీవుడ్ కు దూరంగా ఉన్న మీరా ఇప్పుడు తెలుగులోనూ రీ ఎంట్రీ ఇచ్చేస్తుంది. మీరా జాస్మిన్ 2013 లో మోక్ష చిత్రంలో చివరగా నటించింది. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత “విమానం” అనే సినిమాతో తెలుగులోనూ రీ ఎంట్రీ ఇస్తుంది కేరళ కుట్టి. ఇప్పటికే ఆ సినిమా నుండి వచ్చిన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది.

ఇక తాజాగా మీరా జాస్మిన్ విమానం సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నానంటూ చక్కగా తెలుగులో మాట్లాడుతూ తన సినిమాను తప్పకుండా చూడమంటూ వీడియో ద్వారా తెలిపింది. ఇక ఈ సినిమాలో సముద్రఖని ప్రత్యేక పాత్రలో నటించగా, రాహుల్ రామకృష్ణ, అనసూయ, ధనరాజ్, మాస్టర్ ధృవన్ కీలక పాత్రల్లో నటించగా, ఈ సినిమాకు “శివప్రసాద్ యానాల” దర్శకత్వం వహించాడు. ఇక “విమానం” సినిమాను జూన్9 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు