Vishal: మార్క్ ఆంటోనీ ట్రైలర్.. 80స్ బ్యాక్ డ్రాప్ లో

Vishal:

మాస్ హీరో విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం “మార్క్ ఆంటోనీ”. స్టూడియో ప్రెసెంట్ బ్యానర్ లో ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు అధిక్ రవి చంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా సినిమాలో విశాల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా ఈ మార్క్ ఆంటోనీ ట్రైలర్ రిలీజ్ అయింది. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుపాటి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమా 80స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా మార్క్ ఆంటోనిలో విశాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ట్రైలర్ ద్వారా తెలిసింది. అది కూడా తండ్రి కొడుకుల పాత్ర కావడం విశేషం. అయితే తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉండగా, పలు కారణాల వల్ల తన తండ్రిని చంపుదామన్న ఉద్దేశంతో కొడుకు ఉన్నట్టు చూపించారు. ఇక ఈ సినిమాలో ఎస్.జె సూర్య ప్రత్యేక పాత్రలో నటించగా, తన పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాదాపు సినిమా మొత్తం విశాల్, ఎస్.జె.సూర్య పాత్ర చుట్టే తిరుగుతుందని తెలుస్తుంది.

- Advertisement -

ఇక మార్క్ ఆంటోనీ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, అభినయ, సునీల్, సెల్వ రాఘవన్, కింగ్ స్లీలే, వై.జి. మహేంద్రన్ కీలకపాత్రల్లో నటించారు. ఇక జి.వి ప్రకాష్ సంగీతం అందించగా, ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అయితే మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే అదే రోజు రామ్ నటించిన స్కంద రిలీజ్ అవుతుంది కాబట్టి, తెలుగులో గట్టి పోటీనే ఉందని చెప్పవచ్చు. అయితే రెండూ డిఫరెంట్ జోనర్ లో వస్తున్న సినిమాలు కాబట్టి, ఆడియన్స్ రెండు సినిమాలకు ఓటేసే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు