Malli pelli : రిలీజ్ కి రెడీ అయిన నరేష్ పవిత్రల ప్రేమకథ

యాక్టర్ నరేష్ హీరోగా, పవిత్ర లోకేష్ హీరోయిన్ గా వస్తోన్న చిత్రం ” మళ్ళీ పెళ్లి“. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ యం యస్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.అయితే కొద్ది రోజుల క్రితం రెండు తెలుగు రాష్టాలలో సంచలంగా మారిన నరేష్, పవిత్రల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

పవిత్ర, నరేష్ లు తెలుగులో మంచి పేరున్న నటులు. హీరోగా పలు చిత్రాలలో నటించిన నరేష్ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. పవిత్ర కూడా తెలుగులో మదర్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. అయితే వీళ్లిద్దరు కలిసి పలు సినిమాల్లో భార్య భర్తలుగా నటించారు. మరి వీళ్లిద్దరి ప్రేమ ఎప్పుడు చిగురించిందో తెలీదు గాని ఇద్దరు ప్రేమలో పడ్డారు.

నరేష్ కి ఆమె భార్య రమ్య రఘుపతి కి  తరుచుగా గొడవలు విభేదాలు వస్తుండటంతో పవిత్ర, నరేష్ ల ప్రేమ వ్యవహారం కాస్త పెళ్లి దాక వెళ్ళింది. దాంతో నరేష్, తన భార్య రమ్యకి విడాకులు ఇచ్చి, కొద్దీ రోజుల క్రితమే పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఎవరికీ తెలియని వీళ్ళ ప్రేమ కథని నరేష్ అందరికి తెలియాలనుకున్నారో ఏమో గాని వీళ్ళా ప్రేమకథని సినిమాగా తీయాలనే ఆలోచనతో  ” మళ్ళీ పెళ్లి ”  అనే సినిమా తీశారు. ఇటీవలనే ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ నెల 26న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మూవీ టీం. మరి ఈ లేటు వయసు ప్రేమకథని తెలుగు ప్రేక్షకులు ఆదారిస్తారో లేదో చూడాలంటే మే 26 వరకు వెయిట్ చేయాలి. ఈ సినిమాకి  విరాటపర్వం ఫెమ్ సురేష్ బొబ్బిలి మరియు అరుల్ దేవ్ సంగీతం అందించారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు