Lavanya Tripathi : వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి పీకలదాకా తాగొచ్చిన పవన్ కళ్యాణ్..!

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం హైదరాబాద్ లోని మణికొండ లో ఉన్న నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, రామ్ చరణ్ – ఉపాసన, అల్లు అర్జున్ – స్నేహ, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, అల్లు అరవింద్ – నిర్మల, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ హాజరయ్యారు. బంధువులందరి సమక్షంలో వరుణ్ తేజ్.. లావణ్య కి రింగ్ తొడిగారు. ఇక వీరి పెళ్లి త్వరలోనే జరగనుంది. ఈ పెళ్లిని నాగబాబు రాజస్థాన్ ప్యాలెస్ లో చేయనున్నారని సమాచారం.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై సంచలన ట్వీట్ చేశారు సినీ క్రిటిక్ ఉమైర్ సంధు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి పవన్ కళ్యాణ్ డ్రింక్ చేసి వచ్చాడంటూ సంచలన ఆరోపణలు చేశారు ఉమైర్ సంధు. “పవన్ కళ్యాణ్ మొహం చూడండి. డ్రింక్ & డ్రగ్గి ముఖం చూస్తున్నాను. అతని సిబ్బంది చెప్పిన ప్రకారం అతను ఇప్పుడు స్పృహలో లేడు. సినిమా షూటింగుల వద్ద చాలా తతంగం చూపిస్తున్నాడు” అని రాసుకోచ్చాడు. అంతేకాదు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి హాజరైన పవన్ కళ్యాణ్ ఫోటోని కూడా జోడించాడు. దీంతో ఈ ట్వీట్ చూసిన పవన్ ఫ్యాన్స్ ఉమైర్ సంధుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు