Kriti Sanon : ఆ.. పాత్రలు చేయను

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న కృతి సనన్ ఇటు టాలీవుడ్ లోనూ అభిమానులను పెంచుకున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 1( నేనొక్కడినే) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. సుమారు 15కిి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. తాజాగా కరణ్ జోహార్ ” కాఫీ విత్ కరణ్” షోలో పాల్గొంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కాఫీ విత్ కరణ్ 7 షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిన విషయమే. ఇటీవల సమంత, విజయ్ దేవరకొండ వంటి సౌత్ సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షో దక్షిణాదిలోనూ ఆదరణ పొందింది.

తాజాగా ఈ షోలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, హీరో టైగర్ ష్రాప్ పాల్గొన్నారు. షోలో కృతి సనన్ తాను సినిమాలోకి వచ్చిన కొత్తలో పడిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. అప్పట్లో చాలా సినిమాల ఆడిషన్స్ కిి హాజరైనట్లు తెలిపింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన “లస్ట్ స్టోరీస్” ఆడిషన్స్ లో సైతం తాను పాల్గొన్నట్లు కృతి చెప్పింది. “నేను మొదట ఆడిషన్స్ వెళ్లిన సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 1. ఈ సినిమాకి డైరెక్టర్ మీరే.. ఆ మూవీకి నాకు అవకాశం ఇవ్వలేదు” అని తెలిపింది.

అయితే “లస్ట్ స్టోరీస్” చిత్రంలోని కొన్ని సన్నివేశాలలో శృతి మించిన బోల్డ్ సన్నివేశాలు ఉండడంతో తాను వెనకడుగు వేసినట్లు తెలిపింది. అంత బోల్డ్ గా ఉన్న పాత్రలను చేయడానికి అమ్మ అంగీకరించలేదని.. అందుకే వాటి విషయంలో మినహాయింపు ఇవ్వాలని దర్శకుడు కరణ్ ను కోరినట్లు వివరించింది. కానీ అదే ఆడిషన్స్ కి హాజరైన కియారా అద్వానీ ఆ పాత్ర అంగీకరించడంతో కరణ్ జోహార్ దర్శకత్వంలో నటించే అవకాశం కోల్పోయానని తెలిపింది. ఇక ప్రస్తుతం కృతి సనన్.. ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రను చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు