SSMB28 : కేజీఎఫ్ ఫైటర్స్..

ఇటీవల “సర్కారు వారి పాట” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు మహేష్ బాబు. పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ అభిమానులను విపరీతంగాా ఆకట్టుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఈ మూవీ హిట్టును ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తర్వాత సినిమా చేస్తున్నాడు. SSMB 28 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుండగా, ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ కాంబోలో మహేష్ సినిమా చేస్తున్నారు. మహేష్ కు జోడీగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు ప్రియాంక అరుల్ మోహన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తమన్ సంగీతం అందిస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

“కేజిఎఫ్2” “విక్రమ్” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి వర్క్ చేసిన ఫేమస్ ఫైట్ మాస్టర్ అన్బరిపు సోదరులు అయితే ఈ మూవీ కోసం పని చేయబోతున్నారు. దీనిపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని సమాచారం. ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు