Prabhas : నిర్మాతలు ఛేంజ్

ప్రభాస్ అంటే గుర్తుకు వచ్చేవి పాన్ ఇండియా సినిమాలే. ఒకప్పుడు సినిమాలు చక చకా పూర్తి చేసి వదిలిన ప్రభాస్.. జక్కన్నతో బాహుబలి సినిమా చేసిన తర్వాత ప్రతీ సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, తర్వాత పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ప్రభాస్ నుండి వచ్చిన “సాహో”, ” రాధే శ్యామ్” సినిమాలు తెలుగులో పెద్దగా అలరించలేకపోయాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

వీటితో పాటు స్పిరిట్, ప్రాజెక్టుకే చిత్రాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నాడు. అలాగే ఆది పురుష్ షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇవి కాకుండా తన నెక్స్ట్ మూవీ దర్శకుడు మారుతీతో ఉండబోతుంది. ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానుంది. ఈ కాంబోపై ఇటీవల మారుతి కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు.

ఈ క్రేజీ కాంబో మూవీ పై లేటెస్ట్ గా ఒక ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ మూవీకి టాలీవుడ్ కి చెందిన రెండు ప్రముఖ ప్రొడక్షన్ సంస్థలు కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు మారుతీ తో పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సమావేశం కావడంతో ఈ వార్తలకు మరింత ఆద్యం పోసినట్లయింది. ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, దానయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు