NTR30: తారక్ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకోవడానికి జాన్వీ భారీ ప్లాన్?

బాలీవుడ్ క్వీన్ జాన్వీ కపూర్ కు ఇటీవల టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ NTR30 బంపర్ ఆఫర్ వచ్చిన సంగతి విధితమే. దివంగత నటి శ్రీ దేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ చేసింది తక్కువ సినిమాలే అయినా, హిట్స్ పెద్దగా లేకున్నా, అవకాశాలకు కొదువ లేదు. అందుకు కారణం.. ఒకటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అని చెప్పొచ్చు. స్టార్ కిడ్ కాబట్టి అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి.

జాన్వీ కపూర్ కు అవకాశాలు రావడానికి అందరూ అనుకునే నెపోటిజంతో పాటు మరో కారణం కూడా ఉంది. అదే జాన్వీ అందాల ఆరబోత. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ నెపో కిడ్ తన అందాలను దాచుకోకుండా, ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెడుతుంది. బికినిలు ధరించి కూడా ఫోటోలు పెడుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఈమెకు అతి తక్కువ కాలంలోనే 21 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ను దక్కించుకుంది. జాన్వీ పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోలతోనే ఫుల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది.

తాజాగా ఈ గ్లామరస్ బండి సౌత్ ఇండస్ట్రీపై కన్నేసింది. తారక్ సినిమాలో ఛాన్స్ కొట్టిన ఈ బ్యూటీ, సౌత్ ప్రేక్షకులను, తారక్ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకోవడానికి సిద్ధమవుతుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో గ్లమర్ డోస్ పెంచి ఫోటోలను అప్ లోడ్ చేస్తోంది. తాజాగా పింక్ కలర్ డిజైనర్ బ్రాలెట్ లో జాన్వీ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ పిక్స్ కళ్లు తిప్పుకోలేకుండా ఉన్నాయి. ఇలాంటి గ్లామస్ షో NTR30లో ఉంటే, సినిమాకు చాలా ప్లస్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పక్కన జాన్వీ లాంటి అందమైన హీరోయిన్ ఉంటే, బాక్సాఫీస్ బద్దలు అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో జాన్వీ కి సౌత్ లో కూడా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు