Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్‌తో మరోసారి దొరికిపోయిన బాలీవుడ్ బ్యూటీ

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో కాస్త డిఫరెంట్ గా కనిపించే హీరోయిన్లలో బాలీవుడ్ ముందుగుమ్మ జాన్వి కపూర్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. కొత్త కొత్త కాన్సెప్ట్ లను వెతికి మరి ఫోటోషూట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ధడక్ అనే సినిమా ద్వారా హిందీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత చిత్రాలలో నటించింది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా షేక్ అయ్యే విధంగా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో రెచ్చిపోతూ వరుస గ్లామర్ ఫోటోషూట్లతో అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తుంది.

ఇకపోతే సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ తో అదరగొడుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది అని చెప్పవచ్చు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే, జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో సినిమాతో ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదిలా ఉండగా, తాజాగా జాన్వి తన గాసిప్ ప్రియుడు అయినటువంటి శిఖర్ పహారియాతో కలిసి తిరుమలలో మెరిసింది.

వీళ్లిద్దరూ కలిసి తిరుమల శ్రీవారి సన్నిధిలో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో జాన్వీ ట్రెడిషనల్ వేర్ లో చాలా చక్కగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఈ జంట నిజంగానే రిలేషన్ షిప్ లో ఉందని, అందుకే ఇలా చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు