Prabhas: ఇట్స్ అఫిషియల్.. ప్రాజెక్ట్ K లో మరో బాలీవుడ్ భామ

పాన్ ఇండియా స్టార్ ఆదిపురుష్ ప్రమోషన్లో చాలా బిజీ గా ఉన్నాడు. మరో రెండు రోజుల్లోనే రిలీజ్ ఉండడంతో చిత్ర యూనిట్ తో కలిసి ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న “సలార్” సెట్స్ లో అడుగుపెడతాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తాడు. రెండేళ్ల కిందటే నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ K అన్న టైటిల్ నిర్ణయించగా ఈ సినిమా కుడా భారీ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందనుంది.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించబోయే ఈ సినిమాలో భారీ తారాగణం నటించనున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా, దీపికా పదుకునే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . దాన్ని ఇప్పుడు చిత్ర యూనిట్ కంఫర్మ్ చేస్తూ జూన్ 13న రివీల్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తుందంటూ నిన్న ఆ హీరోయిన్ బర్త్ డే సందర్బంగా ఆమెకు విష్ చేస్తూ రివీల్ చేసారు.

సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కబోయే ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే స్టార్ట్ అయిన ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినా అది కుదరలేదు. ఎందుకంటే దాని కంటే ముందు ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఆదిపురుష్ చిత్ర రిలీజ్ పనుల్లో ప్రభాస్ నిమగ్నమయ్యాడు. దీని తర్వాత సలార్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఆ తర్వాతే ప్రాజెక్ట్ కె సెట్స్ లో అడుగుపెడతాడు. ప్రాజెక్ట్ కే ను 2024 సమ్మర్ లో లేదా దసరా వరకు రిలీజ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు