PS2 : సౌత్ సినిమాలపై సంచలన కామెంట్స్…

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న చిత్రం PS2. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండు భాగాలుగా తీసిన ఈ సినిమా మొదటి పార్ట్ గతేడాది థియేటర్స్ లో రిలీజ్ అయింది. తమిళ్ లో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ , జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలలో నటించారు.

ఈ సినిమాకి సంబంధించిన పార్ట్ 2 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సందర్బంగా మూవీ టీం అన్ని రాష్టాల ప్రజలకి  సినిమా రీచ్ అవ్వాలనే ఉదేశ్యంతో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మేజర్ సిటీస్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, కొచ్చిన్ లలో ప్రమోషన్స్ పూర్తి చేసిన మూవీ టీం ఇప్పుడు నార్త్ స్టేట్స్ లో కూడా మూవీని ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సందర్బంగా మూవీ టీం ముంబై లో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అయితే ఒక మీడియా జర్నలిస్ట్ ఐశ్వర్య రాయ్ ని ఈ విధంగా ప్రశ్నించాడు. “బాలీవుడ్ లో ఎక్కువగా ఇప్పుడు సౌత్ సినిమాలని రీమేక్ చేస్తున్నారు. అవి ఇక్కడ సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక్కడ తీసిన స్ట్రయిట్ సినిమాలేవీ సరిగా ఆడట్లేదు. బాలీవుడ్ ఆడియన్స్ కూడా సౌత్ సినిమాలనే చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే మీరు బాలీవుడ్ సినిమా చేయడం మానేసి సౌత్ కి వెళ్లిపోయారా” అని అడిగాడు.

- Advertisement -

ఆమె జర్నలిస్ట్ ప్రశ్నకి ఐశ్వర్య సమాధానం చెప్తూ.. “నాకు ముందు నుంచే సౌత్, నార్త్ అనే బేధాలు ఏమి లేవు. నేను బాలీవుడ్ బిజీ గా ఉన్న సమయంలో కూడా నేను సౌత్ సినిమాలు చేశాను. ఈ ట్రెండ్ ఈ మధ్య వచ్చింది కానీ నేను ఎప్పుడు సినిమాని సినిమాలాగే చూస్తా అంతేగాని బాలీవుడ్, కోలీవుడ్ అని భేధాలు చూపించలేను. నా అదృష్టం వల్ల నాకు శంకర్ , మణిరత్నం లాంటి పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇలాంటి అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను. నాకు సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే భావన ఎప్పుడు నచ్చదు నా దృష్టిలో సినిమా ఒకటే” అంటూ ఆమె సమాధానం ఇచ్చింది .

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు