Heroines: వ్యాంప్ పాత్రల్లో మెప్పించిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!

Heroines.. పాత్ర డిమాండ్ చేస్తే హీరో అయినా హీరోయిన్ అయినా ఎలాంటి పాత్ర అయినా సరే చేయాల్సిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలామంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సమయంలో వ్యాంప్ పాత్రలు చేసి అందరిని అలరించారు. అలా అనుష్క ని మొదలు అనసూయ వరకు వేశ్య పాత్రలు చేసిన డేరింగ్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం ..

అనుష్క శెట్టి:


అరుంధతి, బాహుబలి లాంటి సినిమాలలో రాజసం ఉట్టిపడే పాత్రలతో అందరిని అలరించిన అనుష్క.. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వేదం సినిమాలో వేశ్య పాత్ర చేసి క్రిటిక్స్ ప్రశంసలు కూడా అందుకుంది.. ఇందులో అల్లు అర్జున్ , మంచు మనోజ్ హీరోలుగా నటించారు.. మునుపెన్నడూ చూడని విధంగా అనుష్కను ఇందులో వేశ్యపాత్రలో చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

- Advertisement -

శ్రియా సరన్:
కెరియర్ కొంచెం డౌన్ అయిన తర్వాత పవిత్ర టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో శ్రియ వేశ్యగా నటించి.. అబ్బురపరిచింది.. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఇప్పుడిప్పుడే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ను పొందే ప్రయత్నం చేస్తోంది.

ఛార్మీ:


దర్శకుడు పూరీజగన్నాథ్ తెరకెక్కించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం జ్యోతిలక్ష్మి సినిమాలో ఛార్మీ తన కెరియర్ లోనే మొదటిసారి వేశ్యగా కనిపించి అలరించింది.

స్నేహ:
హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్నేహ కూడా వేశ్యపాత్రలో నటించారు.. ఈ విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి.. 2006లో ధనుష్ హీరోగా విడుదలైన ధూల్ పేట్ అనే సినిమాలో ఈమె వేశ్య పాత్ర పోషించారు.

రమ్యకృష్ణ:
లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సత్తా చాటిన ఈమె.. విలన్ పాత్రలతో కూడా మెప్పించింది.. హీరోలకు దీటుగా తన నటనతో మెప్పించిన రమ్యకృష్ణ కూడా ఆఖరికి వేశ్య పాత్ర చేసిందంటే నమ్మడం అసాధ్యం. ఈమె కమలహాసన్ హీరోగా తెరకెక్కిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం పంచతంత్రంలో వేశ్యగా నటించి అలరించింది.

టబు:


ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ టబు కూడా బాలకృష్ణ నటించిన భక్తి రస చిత్రం పాండురంగడు సినిమాలో మితిమీరిన శృంగార సన్నివేశాలలో నటించింది.ఇందులో ఆమె వేశ్య పాత్ర పోషించింది.

అనసూయ..


బుల్లితెరపై గ్లామర్ యాంకర్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత సినిమాలలో అవకాశం రావడంతో.. బుల్లితెరకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసి వెండితెరపై అడుగులు వేసింది.. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ విమానం చిత్రంలో వేశ్య పాత్ర చేసింది.. 1000 రూపాయలు ఇస్తే ఎవడైనా ఓకే అంటూ బోల్డ్ రోల్ లో రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఈ పాత్రకు అనసూయకు ప్రశంసలు లభించాయి.

శృతిహాసన్..


స్టార్ కిడ్ శృతిహాసన్ కూడా హిందీ మూవీ ” డి డే ” లో వేశ్య పాత్రలో నటించింది.. మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ని ఉద్దేశిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో పాకిస్తాన్ కి చెందిన వేశ్యగా నటించారు శృతిహాసన్..

వీరితోపాటు అంజలి, బిందు మాధవి ,జయప్రద, జయసుధ లాంటి వారు కూడా వేశ్య పాత్రలు పోషించి అలరించారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు