Trivikram Srinivas: గుంటూరు కారం బ్యాలన్స్ ఇంకా అంతుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో “గుంటూరు కారం” అంటూ మాస్ కమర్షియల్ సినిమా వస్తుందని మనందరికీ తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబో గా ఈ సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ఊరమాస్ గా ఉండడంతో ఉన్న హైప్ కాస్తా తారాస్థాయికి వెళ్ళింది. పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకి సంబంధించి తాజా అప్డేట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. గుంటూరు కారం సినిమా షూటింగ్ ఇప్పటివరకు 50శాతం కంప్లీట్ అవగా ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా 78రోజుల షూట్ బాకీ ఉందని సమాచారం. సెప్టెంబర్ వరకు ఆ వర్క్ మొత్తం పూర్తి చేసి ఆపై ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెడతారని చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులైనా ఇంకా ఇన్నిరోజుల షూటింగ్ బాకీ ఉందంటే సంక్రాంతి కల్లా గుంటూరు కారం రెడీ అవుతుందా లేదా అని అభిమానులకి డౌట్ గా ఉంది.

మామూలుగానే త్రివిక్రమ్ తన సినిమాలను మెల్లిగా తీస్తాడని అందరికి తెలిసిందే. అందుకే మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా షూటింగ్ తొందరగా ముగించేయమని ట్విట్టర్ పేజీల్లో రిక్వెస్ట్ చేస్తుంటే, మరికొంతమంది మహేష్ ఫ్యాన్స్ లేట్ అయినా పర్లేదు, కంటెంట్ మాత్రం సాలిడ్ గా ఉండాలని అంటున్నారు. ఏది ఏమైనా సంక్రాంతికి తమ సినిమా సిద్ధంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు