Meenakshi Chaudhary: రాజీ ఆటలో అరటి పండేనా… ఇక ఏం ఉపయోగం ?

Meenakshi Chaudhary: ఈ సంక్రాంతి టైంలో బాక్సాఫీస్ చాలా హీట్‌గా ఉంది. ఎందుకంటే, జనవరి 12న ఓ భారీ సినిమా గుంటూరు కారంతో పాటు ఓ చిన్న సినిమా హనుమాన్ రిలీజ్ అవుతుంది. దీంతో థియేటర్ల విషయంలో పెద్ద రచ్చే నడుస్తుంది. ఇదింత పక్కన పెడితే గుంటూరు కారం సినిమాపై చాలా హైప్ ఉంది. దీనికి కారణం… స్టార్స్ ఇందులో కనిపించడం…
అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్…
దీంతో పాటు మహేష్ – త్రివిక్రమ్ కాంబో మళ్లీ రావడం.

అయితే ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ, గుంటూరు కారం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్నీ ప్రమోషన్స్ కంటెంట్స్ లో కేవలం శ్రీలీలే కనిపించింది. కానీ, మీనాక్షీ చౌదరికు సంబంధించి ఒక్క పోస్టర్ కూడా రాలేదు. దీంతో అసలు సినిమాలో మీనాక్షీ చౌదరి ఉందా అనే డౌట్ కూడా వచ్చింది.

అంతే కాదు… ఇదే త్రివిక్రమ్ రాసిన ఓ డైలాగ్ కూడా ఫేమస్ అయింది ఈ విషయంలో. అలా వైకుంఠపూరంలో సినిమాలో అల్లు అర్జున్ గురించి సచిన్ ఖేడేకర్ “ఆడ పిల్లను దాచినట్టు దాచాడు” అని అంటాడు. ఇప్పుడు గుంటూరు కారం విషయంలో కూడా మీనాక్ష చౌదరిని ఇలాగే దాచారు అంటూ కామెంట్స్ చేశారు.

- Advertisement -

తాజాగా మూవీ యూనిట్ ఈ డౌట్‌కి ఓ క్లారిటీ ఇచ్చింది. మహేష్ బాబు, మీనాక్షీ చౌదరి కలిసి ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. గుంటూరు కారం సినిమాలో మీనాక్షీ చౌదరి రాజీ అనే పాత్రలో కనిపించబోతుందని రివీల్ చేశారు. అయితే ఇప్పుడు మీనాక్షీ పాత్ర గురించి కొన్ని వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Finally, Meenakshi Chaudhary's look was released in the movie Guntur Karam.

సినిమాలో రమణ (మహేష్ బాబు)కు మరదలుగా రాజీ (మీనాక్షీ చౌదరి) కనిపిస్తుందట. కానీ, రమణ మాత్రం అమ్ము (శ్రీలీల)ను లవ్ చేస్తరని తెలుస్తుంది. అంటే మీనాక్షీ చౌదరి పాత్ర గుంటూరు కారంలో పెద్దగా ఏం ఉండదని ఆటలో అరటి పండే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

అయితే మీనాక్షీ చౌదరి ఇప్పుడిప్పుడే తన కెరీర్ ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటుంది. ఇటీవలే దళపతి 68లో ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇలాంటి టైంలో ఇలా ప్రాధాన్యత లేని పాత్రలు చేయడం వల్ల తన పాత్రకు పెద్దగా ఉపయోగం లేదు అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు