Pooja Hegde: బ్యాలెన్స్ తప్పింది… ఇప్పుడు ఫీల్ అవుతుందా?

పూజా హెగ్డే.. నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న పూజ ఆ తర్వాత బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సరసన మొహంజదారో సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి నిరాశ తప్పలేదు.

ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించిన అలా వైకుంఠపురం చిత్రం అనూహ్య విజయంతో ప్రముఖ స్టార్స్ దృష్టి అంతా పూజా హెగ్డే పైనే పడింది. దీంతో వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. అలా పూజ… ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్, చిరంజీవి – రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య, తమిళ్ లో విజయ్ తో బీస్ట్, హిందీలో సల్మాన్ ఖాన్ తో నటించిన చిత్రాలు వరుసగా విడుదలై ప్లాప్ కావడంతో పూజా హెగ్డే కు కష్టాలు మొదలయ్యాయి.

దీంతో నిర్మాతలు ఆమె వంక చూడాలంటేనే భయపడుతున్నారు. అయితే కెరీర్ పిక్స్ లో ఉండి వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కొన్ని నెలల పాటు రెండు పరిశ్రమలని బాగానే బ్యాలెన్స్ చేసింది. కానీ ఇప్పుడు ఆ బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. ఫలితంగా రెంటికి చెడ్డ రేవడిలా సన్నివేశం కనిపిస్తుంది. ఇటీవల మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ దానిని వదులుకుంది.

- Advertisement -

ఇంత పెద్ద అవకాశం ఇలా ఏలా వదులుకుందని టాలీవుడ్ లో పెద్ద చర్చ సాగింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెడుతున్నట్లు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో పలు సినిమాలను వదులుకొని ఈ బుట్టబొమ్మ తప్పు చేశానని ఫీల్ అవుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు